మిషన్ టీ20 వరల్డ్కప్- USA బయల్దేరిన రోహిత్ బృందం
Published : May 26, 2024, 9:03 AM IST
![మిషన్ టీ20 వరల్డ్కప్- USA బయల్దేరిన రోహిత్ బృందం India T20 World Cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-05-2024/1200-675-21561455-thumbnail-16x9-teamindia.jpg)
India T20 World Cup:T20 ప్రపంచకప్ కోసం రోహిత్ సేన తొలి బృందం శనివారం రాత్రి అమెరికా బయల్దేరింది. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శివమ్ దూబే ప్రయాణమయ్యారు. వీరితోపాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా విమానమెక్కాడు. వీరంతా ముంబయి ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చారు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు ఐపీఎల్ ఫ్లేఆఫ్స్కు అర్హత సాధించిన జట్లలోని ఆయా ప్లేయర్లు త్వరలోనే యూఎస్ఏ వెళ్లనున్నారు. ఇక జూన్ 2న ప్రపంచకప్ ప్రారంభమౌతుంది. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్తో ఆడనుంది.