Rohit About Spinnners:2024 టీ20 వరల్డ్కప్ సెమీస్లో ఇంగ్లాండ్పై టీమ్ఇండియా విజయంలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరు స్పిన్నర్లు చెరో 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. అయితే ఈ వరల్డ్కప్ జట్టు ప్రకటన తర్వాత టీమ్లో 4 స్పిన్నర్లు ఉండడంపై అప్పట్లో పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అంతమంది స్పిన్నర్లు ఎందుకని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మేనేజ్మెంట్ను ప్రశ్నించారు. దీనికి రోహిత్ అప్పుడే ఆన్సర్ ఇచ్చాడు.
వాళ్ల గురించి రోహిత్ అప్పుడే చెప్పాడు- ప్రొఫెషనల్ కెప్టెన్ అనిపించుకున్నాడుగా!
Published : Jun 28, 2024, 3:44 PM IST
![వాళ్ల గురించి రోహిత్ అప్పుడే చెప్పాడు- ప్రొఫెషనల్ కెప్టెన్ అనిపించుకున్నాడుగా! Rohit World Cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-06-2024/1200-675-21817764-thumbnail-16x9-ind-world-cup.jpg)
Rohit World Cup (Source: Associated Press)
'నాకు కచ్చితంగా నలుగురు స్పిన్నర్లు కావాలి. దీనికి కారణాన్ని ఇప్పుడు చెప్పను. వరల్డ్కప్లో మీరే చూస్తారు' అని రోహిత్ అన్నాడు. అయితే టీమ్ఇండియా తాజా విజయాన్ని చూసిన తర్వాత రోహిత్ పక్కా ప్లాన్తోనే స్పిన్నర్లను ఎంచుకున్నట్లు అర్థమైందని నెటిజన్లు కెప్టెన్ను ప్రశంసిస్తున్నారు. 'ప్రొఫెషనల్ కెప్టెన్' అంటూ పొగడ్తతలతో ముంచెత్తుతున్నారు. కాగా, ఈ టోర్నీలో కుల్దీప్ 10, అక్షర్ 8 వికెట్లు పడగొట్టి రాణిస్తున్నారు.