Neeraj Chopra Paris Diamond League : జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రానున్న పారిస్ డైమండ్ లీగ్కు దూరమవుతున్నట్లు వెల్లడించాడు. చిన్న గాయం వల్ల ఇబ్బందిపడుతున్నాడని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యమని నీరజ్ ఈ సందర్భంగా అన్నాడు.
షాకింగ్ : పారిస్ డైమైండ్ లీగ్కు నీరజ్ దూరం! - కారణం ఏంటంటే?
Published : Jul 2, 2024, 11:26 AM IST
NEERAJ CHOPRA (Getty Images)
ఈ ఏడాది జూన్లో జరిగిన పావో నుర్మి గేమ్స్లో నీరజ్ 85.97 మీటర్ల త్రో వేసి ఆ పోటీల్లో విజేతగా నిలిచాడు. "అక్కడ నా పెర్ఫామన్స్ పట్ల నేను సంతోషంగా ఉన్నా. అయితే నేను ఇంకా చేయాల్సింది ఉంది. నా పరుగు కాస్త నెమ్మదిగా అనిపిస్తోంది. మళ్లీ నా సహజ వేగాన్ని అందుకోవాలని అనుకుంటున్నాను. అలా జరగాలి అంటే, నేను పూర్తి ఫిట్గా ఉన్నానన్న నమ్మకం నాకు కలగాలి. కాన్ఫిడెంట్గా రన్వేపై పరుగెత్తాలని అనుకుంటున్నా" అంటూ నీరజ్ తాజాగా అన్నాడు.