హజ్ యాత్రలో 98మంది భారతీయులు మృతి- ఆ కారణంతోనే ఎక్కువగా!
Published : Jun 21, 2024, 8:47 PM IST
![హజ్ యాత్రలో 98మంది భారతీయులు మృతి- ఆ కారణంతోనే ఎక్కువగా! Indians Death In Haj](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-06-2024/1200-675-21765475-thumbnail-16x9-keke.jpg)
Indians Death In Hajj :హజ్ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు లక్షా 70 వేల మంది భారతీయులు మక్కాను సందర్శించినట్లు తెలిపిన విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్, హజ్ యాత్ర మే 9 నుంచి జులై 22 వరకూ జరగనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది హజ్ యాత్రలో పాల్గొన్న భారతీయుల్లో ఇప్పటివరకూ 98 మంది మరణించినట్లు చెప్పిన ఆయన, వీరంతా వృద్ధాప్యం, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడినట్లు వెల్లడించారు. 2023లో హజ్ యాత్ర సందర్భంగా 187 మంది భారతీయులు మృతి చెందినట్లు గుర్తుచేశారు.