national

చరిత్ర సృష్టించిన సెన్సెక్స్- తొలిసారిగా 80వేల పాయింట్ల పైకి- నిఫ్టీ సైతం

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 10:03 AM IST

Updated : Jul 3, 2024, 11:11 AM IST

Stock Market Today
Stock Market Today (ANI)

Stock Market Today :దేశీయ స్టాక్ మార్కెట్లు తాజాగా మరో మైలురాయిని చేరుకున్నాయి. లాభాల్లో కొనసాగుతున్న సెన్సెక్స్‌ తొలిసారి 80 వేల మార్కును దాటి రికార్డుకెక్కింది. నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్టస్థాయిని తాకింది. క్రితం ముగింపు కంటే దాదాపు 600 పాయింట్ల ఎగువన ఉదయం 80 వేల 13 పాయింట్ల వద్ద ప్రారంభమై, తొలిసారి 80వేలు దాటింది. అదే జోరులో 80 వేల 74 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది.

500 పాయింట్ల లాభంతో 79 వేల 950 పాయింట్ల సెన్సెక్స్ ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం ఉదయం నుంచి లాభాల్లో కదలాడుతోంది. ఉదయం 24 వేల 291 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ 24 వేల 307 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిని అందుకుంది. ప్రస్తుతం 150 పాయింట్ల లాభంతో 24 వేల 250 పాయింట్ల ఎగువన నిఫ్టీ ట్రేడవుతోంది.

Last Updated : Jul 3, 2024, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details