national

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం- మిత్ర దేశాల అగ్ర నేతలకు ఆహ్వానం

By ETV Bharat Telugu Team

Published : Jun 6, 2024, 10:30 AM IST

Modi Oath Ceremony
Modi Oath Ceremony (ANI)

Modi Oath Taking Ceremony Invitation : దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి దేశంలో అగ్రనేతలతో పాటు విదేశీ నాయకులను ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్‌ దేశాల అగ్రనేతలను రావాలని కోరనున్నట్లు తెలిసింది. మోదీ ఆహ్వానాన్ని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే అంగీకరించారు. స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాకు మోదీ ఫోన్‌ చేసి ఆహ్వానించగా, ఆమె వస్తానని చెప్పినట్లు తెలిసింది. నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్బే, మారిషస్ ప్రధానమంత్రి పర్వింద్ జుగ్నౌత్‌ను, మోదీ ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానం పంపినట్లు సమాచారం. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు దక్షిణాసియా సహకార సమాఖ్య-సార్క్ సభ్యదేశాల నాయకులు హాజరయ్యారు. 2019లో రెండోసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు బిమ్స్‌టెక్ దేశాల నేతలు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details