ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కాలువల సుందరీకరణ - త్వరలోనే బోటు షికారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

VMC Plan For Boat Ride in Bandar, Eluru, Raivas Canals : బందరు, ఏలూరు, రైవస్ కాలువల సుందరీకరణ పనులపై విజయవాడ నగరపాలక సంస్థ దృష్టి సారించింది. భవిష్యత్​లో బోటు షికారు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తోంది. విజయవాడ నగరంలో ప్రవహించే ప్రధాన కాలువలైన బందరు, ఏలూరు, రైవస్ కాలువలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఈ కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించేందుకు వివిధ సాంకేతిక పద్ధతులు అవలంబిస్తోంది. 

దీంతో పాటు ప్రజలు కాలువల్లో చెత్త వేయకుండా ఇసుప మెస్‌లను ఏర్పాటు చేశారు. కాలువల్లో చెత్త వేయకుండా ఉండేందుకు అవగాహన కోసం వంతెనల వద్ద మైక్ ఎనౌన్స్​మెంట్ చేస్తున్నారు. దీంతో పాటు భవిష్యత్తులో బందరు, ఏలూరు, రైవస్ కాలువల్లో బోటు షికార్​ను ఏర్పాటు చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ భావిస్తోంది. దీంతో పాటు కాలువ గట్లపైనా పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. 

ABOUT THE AUTHOR

...view details