ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతాం: బాబు రాజేంద్ర ప్రసాద్ - గుంటూరులో సర్పంచ్​ల నిరసన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 4:47 PM IST

Sarpanch Dharna For Funds In Guntur Collectorate : గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట సర్పంచుల సంఘం ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్‌లోకి సర్పంచులు వెళ్లేందుకు యత్నించటంతో పోలీసులు (Police) అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది. పోలీసులు సర్పంచులను (Sarpanch) నిలువరించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్​లకు నిధులు, విధులు లేకుండా చేసిందని ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ (YSRCP) ఓటమే లక్ష్యంగా సర్పంచులందరూ ముందుకు సాగుతామన్నారు.

Sarpanch Protest Against YSRCP Govt : ఈ క్రమంలో ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సర్పంచ్​లు ఎన్నిసార్లు రోడ్లెక్కి ప్రశ్నించినా ప్రభుత్వం మా నిధులు మాకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమ నిధులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దోచుకుందని, సొంత అవసరాలకు వాడుకుందని వారు ఆరోపించారు. ఇప్పటికీ అధికారులు స్పందించకపోతే నిరసన మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details