ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై తివర్ణ పతాకం ఎగుర వేద్దాం: పురందేశ్వరి - Purandeswari on Independence Day

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 2:15 PM IST

Rajamandi BJP MP Purandeswari on Independence Day (ETV Bharat)

Rajamandi BJP MP Purandeswari on Independence Day : భారత స్వాతంత్య్రదినోత్సవాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా 'హర్‌ ఘర్‌ తిరంగా (Har Ghar Tiranga)' ప్రచార కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది. ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఈ తరుణంలో నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సోషల్ మీడియా ఖాతాల్లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. అలాగే ట్విట్టర్​ (X) వేదికగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

యోధుల ప్రాణ త్యాగాల ఫలితంమే మనకు స్వాతంత్య్రం : భావితరాల్లో జాతీయ వాదం పెంపొందించడానికి ఆనాటి స్వాతంత్య్రోద్యమ యోధులకు నివాళిగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై తివర్ణ పతాకం ఎగుర వేద్దామని పురందేశ్వరి పిలుపునిచ్చారు. మన ముందు తరాలవారు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని, ఎన్నో త్యాగాలు చేసి మన దేశానికి స్వాతంత్య్రాన్ని అందించారని ఆమె గుర్తు చేశారు. ఎందరో స్వాతంత్య్రోద్యమ యోధుల ప్రాణ త్యాగాల ఫలితమే మనకు స్వాతంత్య్రం లభించిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details