ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఫుల్​గా మందేసి కొండచిలువతో ముచ్చట్లు - అది ఏం చేసిందంటే!

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

Python On Drunk Man in Nandyal District : పీకలదాకా తాగడం, తాగి రోడ్లపై పచార్లు, చిల్లర వేశాలు, ప్రమాదకర చేష్టలు చేస్తుంటారు కొందరు. ఈ క్రమంలో కొందరు పక్కవాళ్లకి ఇబ్బందులు కలిగిస్తే మరికొందరు తమకు తామే ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. తాగిన మైకంలో ఏం చేస్తున్నామనే విచక్షనే ఉండదు మందుబాబులకు. దీనికి నిదర్శనమే నంద్యాల జిల్లా అవుకులో జరిగిన ఘటన. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపైకి కొండ చిలువ ఎక్కింది. అయినా అతడిలో భయం, బెరుకూ కాదు కదా తనపై కొండచిలువ ఉందనే విషయమే సోయి లేకుండా కూర్చున్నాడు. తాగిన మైకంలో చలనం లేకుండా మత్తులోనే తూలుతున్నాడు. మందుబాబుపై ఎక్కిన కొండ చిలువను పసిగట్టిన స్థానికులు కర్రల సహాయంతో దాన్ని తొలగించారు. దీంతో కొండ చిలువ బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు మందుబాబు.

ఇంతకు ముందు ఇలాంటి ఘటన కేరళలో జరిగింది. ఓ వ్యక్తి తాగిన మత్తులో భారీ కొండచిలువతో విన్యాసాలు చేశాడు. కోజికొడ్​కు చెందిన జీతు అనే వ్యక్తి తన ద్విచక్రవాహనం వెనకాల దాదాపు 8అడుగుల పొడవైన కొండ చిలువను పెట్టుకుని రాత్రి సమయంలో వీధుల్లో తిరిగాడు. అది గమనించిన కొంతమంది వాహనదారులు అతన్ని వారించారు. దీంతో మరింత రెచ్చిపోయిన మందుబాబు దాన్ని శరీరంపై పెట్టుకుని ప్రమాదకర విన్యాసాలు చేసిన ఘటన కలకలం రేపింది.

ABOUT THE AUTHOR

...view details