Published : Mar 20, 2024, 7:35 PM IST
అధిక ధరకు విక్రయిస్తున్నారని మద్యం దుకాణాలపై దాడి - క్షణాల్లో వైన్ బాటిళ్లను దోచుకున్న స్థానికులు
People Robbed Liquor in Wine Shop : అధిక ధరలకు వైన్ విక్రయిస్తున్నారని పలు మద్యం దుకాణాలకు స్థానికులు భారీ షాక్ ఇచ్చారు. వైన్ షాపులపై దాడి చేస్తూ మద్యాన్ని లూటీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో మద్యం ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని అగ్రహం వ్యక్తం చేస్తూ నాలుగు దుకాణాలపై దాడికి దిగారు. ఈ క్రమంలో వైన్షాప్ లోపలికి వెళ్లిన స్థానికులు, రెప్పపాటులో పలు మద్యం బాటిళ్లను దోచుకొని నిమిషాల వ్యవధిలో జారుకున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు.
Liquor Robbed in Bhadra Kothagudem : దర్జాగా సంచులతో సైతం ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొందరు అందినకాడికి మద్యం బాటిళ్లను దోచుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మద్యం దుకాణాలన్నీ ప్రధాన రహదారిపై ఉండడంతో, కొంతసేపటి వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న కొందరికి ఏమీ జరుగతుందనే అర్థంకాక గందరగోళం నెలకొంది. పలు దుకాణాల్లో భారీగా మద్యం తీసుకెళ్లడంతో వైన్షాప్స్ ఖాళీగా దర్శనమిచ్చాయి.