ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: మడకశిర నియోజకవర్గంలో నారా లోకేశ్ శంఖారావం - ప్రత్యక్ష ప్రసారం - Lokesh Shankaravam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 2:32 PM IST

Updated : Mar 7, 2024, 2:47 PM IST

Nara Lokesh Sankharavam Meeting Live:  నేటి నుంచి రాయలసీమలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  రెండో విడత 'శంఖారావం' పర్యటనలు ప్రారంభం అయ్యాయి. నేడు నారా లోకేశ్ హిందూపురం నుంచి 'శంఖారావం' ప్రారంభించారు. ఇవాళ హిందూపురం, మడకశిర, పెనుకొండ స్థానాల్లో సభల్లో పాల్గొంటున్నారు. రేపు పుట్టపర్తి, కదిరిలో నారా లోకేశ్  'శంఖారావం' సభల్లో పాల్గొంటారు. అనంతపురం జిల్లాలో టీడీపీ శంఖారావం పూరించనుంది. ఐదు రోజులుపాటు 12 నియోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హాజరవుతున్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి పర్యటన షెడ్యూల్‌ జిల్లాకు అందింది. ముందుగా హిందూపురం పార్లమెంటు పరిధిలోని నేడు హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోను శంఖారావం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాత్రికి పుట్టపర్తిలో బస చేస్తారు. 8న పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లోను, 9న కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లోను, 10న ఉరవకొండ, అనంతపురం, శింగనమల నియోజకవర్గాల్లోను, 11న తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాలో శంఖారావం కార్యక్రమం నిర్వహించనున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జులంతా కార్యక్రమం విజయవంతం చేసేందుకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ప్రస్తుతం మడకశిర నియోజకవర్గంలో నారా లోకేశ్ శంఖారావం కొనసాగుతోంది. ప్రత్యక్ష ప్రసారం మీకోసం. 
Last Updated : Mar 7, 2024, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details