LIVE: విజయవాడ కలెక్టరేట్లో మంత్రి పార్థసారథి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Parthasarathy Press Meet
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2024, 7:13 PM IST
|Updated : Sep 4, 2024, 7:22 PM IST
PARTHASARATHY PRESS MEET LIVE (ETV Bharat)
Minister Kolusu Parthasarathy Press Meet Live: విజయవాడ కలెక్టరేట్ నుంచి మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరంలోని ముంపు ప్రాంతాల్లో ఉన్న వారితో ఆయన మాట్లాడారు. వరద బాధితులకు అండగా నేనున్నానంటూ సహయక చర్యలను సీఎం చంద్రబాబునాయుడు ఓ యజ్ఞంలా చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అర్ధరాత్రి వరకు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారని వివరించారు. నదీ పరివహక ప్రాంతాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి మంత్రి పర్యటించారు. యనమలకుదురు, పెద పులిపాకలోని నీట మునిగిన పలు కాలనీలను పరిశీలించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా లేని కాలనీల్లో త్వరితగతిన పునరుద్దరించాలని అధికారులను ఆదేశించారు. వరదల వల్ల సర్వం కోల్పోయాని మహిళ మంత్రి ఎదుట కన్నీటిపర్యంతం అయ్యారు. బాధితులందిరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్ని విధాలుగా అదుకుంటామని భరోసా కల్పించారు. తక్షణమే బియ్యం, నిత్యావసర సరుకులుతో పాటు కురగాయాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో విజయవాడ కలెక్టరేట్ నుంచి మంత్రి పార్థసారథి మీడియా సమావేశం
Last Updated : Sep 4, 2024, 7:22 PM IST