ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు- నాగబాబు తీవ్ర హెచ్చరిక - janasena warning

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 1:22 PM IST

కూటమి ఐక్యతకు భంగం కలిగించే రాతలపై కఠిన చర్యలు: నాగబాబు (ETV Bharat)

Jansena Nagendrababu : కూటమి పార్టీల ఐక్యతను దెబ్బతీసేలా చేసే ప్రయత్నాలపై జనసేన నేత నాగబాబు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఎన్డీఏ కూటమి స్ఫూర్తిని కించపరిచేలా అసత్య ప్రచారాన్ని వ్యాప్తి చేసే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సార్వత్రిక ఎన్నికల్లో విజయాన్ని ఆసరాగా తీసుకుని ఎవరైనా కూటమి స్ఫూర్తిని భంగపరిచేలా రాతలు రాస్తే ఊరుకునేది లేదని జనసేన సీనియర్‌ నేత నాగబాబు హెచ్చరించారు. ఇప్పటికే ఇలాంటి వార్తలని స్ప్రెడ్ చేసిన వారిపై చర్యలు చేపట్టామన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ పూర్తిగా చావలేదని, ఇంకా బతికే వుందని పేర్కొన్నారు. ఆ కోరల్లోంచి వచ్చే విషపు రాతలను ఎవరూ పట్టించుకోవద్దని నాగబాబు కోరారు. కూటమికి‌ సంబంధించిన మూడు పార్టీల అధినేతలు సమష్టి, నిర్మాణాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తారని తేల్చిచెప్పారు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలని ఎవరు రాసినా, వాటిని ఎవరు వ్యాప్తి చేసినా మూలాన్ని పట్టుకుని కఠిన శిక్షలు అమలయ్యేలా చేస్తామని నాగబాబు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details