ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మొదటి నుంచి భోజన ప్రియుడినే- ఇంటి వంటలు ఎక్కువ ఇష్టపడతా: వెంకయ్యనాయుడు - Venkaiah Naidu in Mandavas Hotel

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 5:07 PM IST

Venkaiah Naidu Visited Mandavas Hotel (ETV Bharat)

Former Vice President Venkaiah Naidu Visited Mandavas Hotel : విజయవాడ అంటేనే విభిన్న రుచుల భోజనానికి ప్రసిద్ది అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పెరుగుతున్న పాశ్చాత్య పోకడల వల్ల అర్థం కాని పేర్లు పెట్టి ఫాస్ట్ పుడ్ అమ్ముతున్నారని చెప్పారు. విజయవాడలోని పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్డులోని మండవాస్ హోటల్​ను వెంకయ్యనాయుడు సందర్శించారు. మండవాస్ హోటల్​లో‌ భోజనం బాగుందని మిత్రులు చెప్పగా తాను ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపారు.

తాను మొదటి నుంచి భోజన ప్రియుడినని, ఇంటి తరహా భోజనం ఎక్కువ ఇష్టపడతానని వెంకయ్య నాయుడు చెప్పారు. ఇక్కడ వంటకాలు రుచిగా, శుచిగా ఉన్నాయని పేర్కొన్నారు. మాంసాహార, శాకాహార వంటకాలు రుచి చూశానని వివరించారు. ఇటీవల సంప్రదాయ వంటలు వదిలి ఫాస్ట్ ఫుడ్ రుచుల మోజులో యువత వెళుతుందన్నారు. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల అనర్ధాలే ఎక్కువ జరుగుతున్నాయని, ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. యువత మన సంప్రదాయ వంటకాలు తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వెంకయ్య నాయుడు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details