ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైలు ఇంజన్​పై బాలుడు హల్‌చల్‌- హడలెత్తిన తోటి ప్రయాణికులు - Boy Climbing Train Top Halchal

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 6:20 PM IST

BOY CLIMBING IN TRAIN TOP (ETV Bharat)

Boy Climbing Top on Train Engine at Bapatla Railway Station : బాపట్ల రైల్వే స్టేషన్‌లో మతిస్థిమితం లేని ఓ బాలుడు రైలు ఇంజన్ పైకెక్కి హల్‌చల్‌ చేశాడు. గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్​ బాపట్ల స్టేషన్​కు రాగానే అప్పటికే ప్లాట్​ఫాంపై ఉన్న ఓ బాలుడు ఒక్కసారిగా ఇంజన్ పైకి ఎక్కాడు. దీంతో బోగీలో ఉన్న ప్రయాణికులు హడలెత్తిపోయారు. వెంటనే రైల్వే యంత్రాంగానికి సమాచారం ఇవ్వడంతో, వారు విద్యుత్‌ సరఫరా నిలిపి వేసి బాలుడిని బలవంతంగా కిందకు దించారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. 

రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించడంతో బాలుడికి పెను ప్రమాదం తప్పింది. బాలుడుని స్టేషన్‌కు తరలించి వివరాలు తెలుసుకోగా కలకత్తా వాసిగా గుర్తించారు. బాలుడికి మతిస్థిమితం సరిగా లేదని తేలింది. దీంతో అతన్ని బాల సదన్‌కు తరలించారు. త్వరలోనే ఆ బాలుడుని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనతో ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్ దాదాపు 15 నిమిషాలు బాపట్ల స్టేషన్​లోనే నిలిచిపోవాల్సి వచ్చింది

ABOUT THE AUTHOR

...view details