ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చింతలపూడి 'రా కదలిరా' సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2024, 3:14 PM IST

Bomb squad check in Chandrababu Ra Kadali Ra Sabha: చింతలపూడి 'రా కదలిరా' సభ ప్రాంతంలో బాంబ్‌ స్క్వాడ్‌ బజర్‌ మోగడం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. మాడుగులలో పర్యటన ముగించుకుని మధ్యాహ్నం చంద్రబాబు హెలీకాప్టర్‌లో చింతలపూడి రావాల్సి ఉంది. చంద్రబాబు హెలీకాప్టర్‌ దిగే హెలీ ప్యాడ్‌ వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా బాంబ్ స్కాడ్ తనిఖీలు చేపట్టారు. ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా బాంబ్‌ స్క్వాడ్‌ బజర్‌ మోగింది. దీంతో పూర్తిస్థాయిలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బజర్‌ మోగిన ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పూర్తిస్థాయిలో భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. 

 అంతకుముందు అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన ‘రా కదలి రా’ సభలో పాల్గొన్న చంద్రబాబు, సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. బటన్‌ నొక్కుతున్నానని సీఎం జగన్‌ గొప్పలు చెబుతున్నారన్నారు. బటన్‌ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతేంటి? అంటూ  ప్రశ్నించారు. సీఎం జగన్ పుణ్యం వల్లే చెత్తపన్ను వచ్చిందని ఎద్దేవా చేశారు. 

ABOUT THE AUTHOR

...view details