ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్ పులివెందుల పర్యటన - ఘోర ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి - ys jagan pulivendula tour

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 7:47 PM IST

Updated : Jun 22, 2024, 8:14 PM IST

YS Jagan Pulivendula Tour: ఘోరంగా ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి పులివెందులకు చేరుకున్నారు. కడప నుంచి పులివెందులకు 80 కిలోమీటర్ల దూరానికి నాలుగున్నర గంటలు సమయం కేటాయించారు. ఘోర ఓటమి తర్వాత సొంత నియోజకవర్గానికి చేరుకున్న జగన్​ను పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతితో పలకరించే ప్రయత్నం చేశారు.

YS Jagan Pulivendula Tour
YS Jagan Pulivendula Tour (ETV Bharat)

YS Jagan Pulivendula Tour: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఘోరంగా ఓటమి పాలైన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులకు చేరుకున్నారు. గన్నవరం నుంచి విమానంలో మధ్యాహ్నం ఒంటిగంటకు కడప విమానాశ్రయం చేరుకున్నారు. కడప నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరిన మాజీ సీఎం జగన్, ప్రతి గ్రామంలో వాహనాన్ని నిలిపి కార్యకర్తలను నాయకులను పలకరించారు. కడప నుంచి పులివెందులకు 80 కిలోమీటర్ల దూరానికి నాలుగున్నర గంటలు సమయం కేటాయించారు.

పులివెందుల క్యాంపు కార్యాలయం చేరుకున్న జగన్​కు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అందరికీ అభివాదం చేసుకుంటూ వాహనంపైనే నమస్కరించుకుంటూ క్యాంపు కార్యాలయంలోకి వెళ్లారు. పులివెందుల క్యాంపు కార్యాలయానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు పలువురు ముఖ్య నేతలు వచ్చి జగన్​ను కలిశారు. పార్టీ నాయకులతో జగన్ సమావేశమయ్యారు. ఘోరమైన ఓటమి తర్వాత సొంత నియోజకవర్గ చేరుకున్న జగన్​కు పార్టీ నాయకులు, కార్యకర్తలు సానుభూతితో పలకరించే ప్రయత్నం చేశారు.

పులివెందులకు వచ్చిన జగన్‌ను ప్రాంత వాసులు నిలదీయాలి: బీటెక్‌ రవి - BTech Ravi on YS Jagan

ఓటమి అనంతరం తొలిసారి పులివెందులకు: ఎన్నికల్లో ఓటమి అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి పులివెందుల పర్యటన పై ఆ పార్టీ నేతల్లో ఆసక్తిని పెంచింది. తొలుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సతీమణి వైఎస్ భారతీ ప్రత్యేక విమానంలో కడప బయలుదేరి వెళ్లారు. కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల బయలుదేరి వెళ్లనున్నారు.

ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వీడ్కోలు పలకడానికి గన్నవరం విమానాశ్రయానికి ఒక్క ఎమ్మెల్యే కూడా రాకపోవడం చర్చాంశనీయంగా మారింది. తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమనాశ్రయానికి చేరుకున్నారు. స్థానిక వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు గానీ, ఓటమి చెందిన ఒక్క ఎమ్మెల్యేగానీ రాలేదు. ఒక్క తలశిల రఘురామ్ తప్ప జగన్ మోహన్ రెడ్డికి వీడ్కోలు పలకడానికి ఎవరూ రాలేదు.

'నేనింతే - నా తీరింతే - అసెంబ్లీకి రానంతే' - Jagan on Speaker Election Process

ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టిన జగన్‌ కాన్వాయ్‌: వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో ఆయన వాహనశ్రేణిలోని ఓ వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. కడప శివారులోని రామరాజుపల్లె వద్ద జగన్ కాన్వాయ్​లోని వాహనం ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం ముందుభాగం పూర్తిగా దెబ్బతినింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రెండు వాహనాల్లో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో తమ వాహనం పూర్తిగా దెబ్బతిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని మరోవాహనంలోని కుటుంబ సభ్యులు నిట్టూర్చారు. ప్రాణాపాయం లేకపోవడంతో చేసేదిలేక కుటుంబ సభ్యులు వాహనం తీసుకొని వెళ్లిపోయారు.

అసెంబ్లీలో తడబడిన జగన్​ రెడ్డి- 'ఘోరఓటమి తరువాత ఇదే తొలిసారి - pulivendula mla ys jagan oath

జగన్ పులివెందుల పర్యటన (ETV Bharat)
Last Updated : Jun 22, 2024, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details