ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిస్టరీగా వాలంటీర్ల మృతి - నిస్సహాయ స్థితిలో మృతుల కుటుంబాలు - volunteer died in suspicious manner - VOLUNTEER DIED IN SUSPICIOUS MANNER

volunteer died in a suspicious manner: విజయనగరం జిల్లాలో ఒకే నెలలో ఇద్దరు వాలంటీర్లు మృతి చెందిన ఘటన సంచలనం రేపింది. మృతులిద్దరూ బొబ్బిలి పట్టణానికి చెందిన వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన రైలు పట్టాలపై అనుమాన స్పద స్థితిలో వాలింటీర్ మృతి చెందగా, మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన మరో వాలింటీర్ నేడు బావిలో శవమై తేలాడు.

volunteer died in a suspicious manner
volunteer died in a suspicious manner

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 9:48 PM IST

Updated : Mar 26, 2024, 6:34 AM IST

Volunteer Died in Suspicious Manner:ఒకే నెలలో ఇద్దరు వాలంటీర్లు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే, మృతి చెందిన ఇద్దరు వాలంటీర్లు ఏ కారణంతో మృతి చెందారనే అంశం మిస్టరీగా మారింది. ఈ నెల 1వ తేదీన ఓ వాలింటీర్ మృతదేహం రైలు పట్టాలపై అనుమానాస్పద రీతిలో లభించింది. మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మరో వాలంటీర్ నేడు బావిలో శవమై కనిపించాడు.

రాణిగారి తోట సమీపంలో మృతదేహం: విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం 15వ వార్డు వాలంటీర్​గా పని చేస్తున్న ఆలబోను వెంకట సాయి రామకృష్ణ (24) సోమవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. మూడు రోజులు క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిన రామకృష్ణ తిరిగి రాలేదు. అతని ఫోన్​ సైతం పని చేయలేదు. ఆందోళన చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. సోమవారం రాణిగారి తోట సమీపంలోని నేలబావిలో రామకృష్ణ మృతదేహం లభించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

వెంకట సాయి రామకృష్ణ గత నాలుగు సంవత్సరాలుగా 15వ వార్డులో వాలంటీర్​గా విధులు నిర్వహిస్తున్నారు. రామకృష్ణది హత్యా లేదా ఆత్మహత్యా అనే విషయం తెలియాల్సి ఉంది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ నాగేశ్వరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. హత్యా, లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని తెలిపారు.

ప్రేమ పేరుతో వాలంటీర్​ వేధింపులు - బాలిక ఆత్మహత్యాయత్నం

రైలు పట్టాలపై అనుమానాస్పద రీతిలో :ఈనెల 1వ తేదీన సైతం బొబ్బిలి పట్టణంలోని 10 వార్డ్​ వాలంటీర్​గా పని చేస్తున్న కిలారి నాగరాజు సైతం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. నగర సమీపంలోని రైలు పట్టాలపై నాగరాజు మృతదేహం లభించింది. నాగరాజు సోదరుడు రవి సైతం గతంలో 10 వార్డు వాలంటీర్​గా విధులు నిర్వహించేవాడు. అయితే, రవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, రవి సోదరుడైన నాగరాజును అధికారులు 10 వార్డు వాలంటీర్ గా నియమించారు. నాగరాజు కేసును సైతం పోలీసులు అనుమాన మృతిగా, కేసు నమోదు చేశారు. ఒకే నెలలో ఇద్దరు వాలంటీర్లు మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది.

ఇలా 10వ వార్డు, 15 వార్డుకు చెందిన ఇద్దరు వాలంటీర్లు మృతి చెందడంతో బొబ్బిలి పట్టణంలో పని చేస్తున్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది. బొబ్బిలి నగరంలో వాలంటీర్లుగా పని చేయాలంటే ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు వెంటనే స్పందించి ఇవి హత్యలా లేదా ఆత్మహత్యలా అని తెల్చాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

సచివాలయంలో ఉరేసుకుని వాలంటీర్​ ఆత్మహత్య

Last Updated : Mar 26, 2024, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details