ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడ ప్రజలకు అందని స్వచ్ఛమైన తాగునీరు - Discolored Water in Vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 3:42 PM IST

Contaminated Drinking Water Problem in Vijayawada: విజయవాడ ప్రజలకు తాగు నీరు అందని ద్రాక్షగా మారింది. స్వచ్ఛమైన నీరు అందించాలని వేడుకొంటున్న వీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండు నెలల క్రితం కలుషిత నీరు పలువురు మృతి చెందారు. ఇది మరువక ముందే తాగు నీరు గోధుమ రంగులో రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Vijayawada People Suffer With Discolored Water
Vijayawada People Suffer With Discolored Water (ETV Bharat)

VijayawadaPeople Suffer With Discolored Water :విజయవాడ ప్రజలు తాగు నీటి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీఎంసీ విడుదల చేస్తున్న తాగు నీరు గోధుమ రంగులో వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తున్న విజయవాడ నగర పాలక సంస్థ తాగడానికి మాత్రం స్వచ్ఛమైన నీరు అందించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం విజయవాడలోని మొగల్రాజపురం, పాయకపురం ప్రాంతాల్లో కలుషిత నీళ్ల కారణంగా డయేరియా విజృంభించిందని, దీంతో పలువురు మృత్యువాత పడడంతో పాటు తీవ్ర అస్వస్థకు గురయ్యారని ప్రజలు వాపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

విజయవాడలో కోరలు చాచుతున్న డయేరియా - ఇంకా కళ్లు తెరవని నగర పాలక సంస్థ! - Contaminated Drinking Water

Drinking Water Problem in Vijayawada :ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పటమట, మొగల్రాజపురం, వన్ టౌన్ ప్రాంతంలోని పలు కాలనీల్లో వీఎంసీ విడుదల చేస్తున్న నీరు సక్రమంగా రావడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వీఎంసీ విడుదల చేస్తున్న నీరు రంగు మారి రావడంతో పాటు మట్టి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడప్పుడు పురుగులు సైతం కుళాయిల్లో వస్తున్నాయని వాపోతున్నారు. దీంతో ఆ నీరు తాగలేక ప్రైవేట్​ వాటర్ ప్లాంట్లకు వెళ్లి నీళ్లు కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. ఆర్వో వాటర్ ప్లాంట్లలోని నీళ్లు రోజూ తాగడం వల్ల మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. నీటి పన్ను వసూలు చేస్తున్న వీఎంసీ తమకు తాగడానకి స్వచ్ఛమైన నీళ్లు అందించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

రెండు నెలల క్రితం విజయవాడలో డయేరియ విజృంభించడంతో పలువురు చనిపోవడంతో పాటు అనేక మంది తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సంఘటనలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా వీఎంసీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తమకు అందిస్తున్న నీటిలో డ్రైనేజీ నీరు కలుస్తుందేమోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాగు నీటి సరఫరా పైపులు పాతవి కావడంతో అనేక చోట్ల దెబ్బతిన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుభ్రమైన తాగునీరందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వైఎస్సార్సీపీ పాలనలో తాగునీటి వ్యవస్థ ధ్వంసం - కలుషిత నీరు తాగుతున్నామంటున్న గ్రామస్థులు - ycp Neglect Rallapadu Water Scheme

"పది రోజుల నుంచి తాగు నీరు చాలా మురికిగా, రంగుమారి వస్తున్నాయి. నీటిలో డ్రైనేజీ కలుస్తుందేమో అని నాకు అనుమానంగా ఉంది. అధికారులు స్పందించి మాకు స్వచ్ఛమైన నీరు అందించాలని కోరుతున్నాం." విజయవాడ ప్రజలు

తుప్పుపట్టిన పైపులైన్లు, రంగుమారిన నీరు- కలుషిత జలాలతో పేదల ప్రాణాలు గాలిలో! - DRINKING WATER PROBLEM

ABOUT THE AUTHOR

...view details