Tirumala Thalayeru Gundu : పురాణ ప్రసిద్ధి చెందిన అత్యంత ప్రాచీన మహాక్షేత్రం తిరుమల. చారిత్రకంగా కూడా చాలా ప్రాధాన్యం కలిగిన దివ్యధామం. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలవారి భక్తిశ్రద్ధలకు అది ప్రముఖ కేంద్రం. ఎందరో చక్రవర్తులు, భక్తయోగులు కొలుచుకున్న సంస్కృతీ సౌధం. వైఖానస ఆగమరీతులతో అర్చనా విధానాలు, పూజలు జరుగుతున్న సంప్రదాయ పరంపర ఈ శేషాచలానికి ఉంది. ఇక్కడ శ్రీవేంకటేశ్వరుడు సర్వదేవతాత్మకుడైన నారాయణ పరబ్రహ్మమని రుషుల ప్రతిపాదన. ఈ విష్ణువిరాణ్మూర్తి సాక్షాత్ వైకుంఠవాసుడే!
కొలిచిన వారికి కొంగుబంగారంగా, కోరిన కోరికలు తీర్చే శ్రీనివాసుడు ఏడుకొండలపై కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. అందుకే కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. కాలినడకన, రోడ్డు మార్గం ద్వారా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారు. మరి కాలినడక మార్గంలో అలిపిరి శ్రీవారి పాదాల మండపం నుంచి తిరుమలకు వెళ్లే రూట్లో ఓ రాతి గుండు కనిపిస్తుంది. అదేదో ఓ రాయి అనుకుంటే మీరు పొరబడినట్లే. దానికో ఓ చరిత్ర ఉంది. అదెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.