ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇకపై నో బెనిఫిట్ షోలు - టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిచ్చేది లేదు: మంత్రి కోమటిరెడ్డి - KOMATIREDDY ON BENEFIT SHOWS

ఇకనుంచి ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని అసెంబ్లీలో స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి - అలాగే టికెట్ల రేట్ల పెంపునకూ అనుమతి ఇచ్చేది లేదని వెల్లడి

TG Minister Komatireddy Venkat Reddy About Movie Benefit Shows
TG Minister Komatireddy Venkat Reddy About Movie Benefit Shows (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2024, 6:00 PM IST

TG Minister Komatireddy Venkat Reddy About Movie Benefit Shows :సినిమా బెనిఫిట్​ షోలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదలకు ముందురోజు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇకనుంచి టికెట్ల రేట్ల పెంపునకూ అనుమతి ఇచ్చేది లేదన్నారు. సంధ్య థియేటర్​ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పరిహారమిస్తానన్న హామీని అల్లు అర్జున్​ నిలబెట్టుకోలేదన్నారు. ప్రతీక్​ ఫౌండేషన్‌ నుంచి రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఇస్తామని తెలిపారు. శ్రీతేజ్‌ చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.

పుష్ప-2 బెనిఫిట్​ షో సందర్భంగాహైదరాబాద్​లోనిసంధ్య థియేటర్​ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, బాలుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు సినీ హీరో అల్లు అర్జున్​ను అరెస్ట్ చేయగా హైకోర్టు ఈ నెల 27 వరకు మధ్యంతర బెయిల్​ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇదే ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చలు జరిగాయి. చర్చ సందర్భంగా సంధ్య థియేటర్​ ఘటనపై సీఎం రేవంత్​ రెడ్డి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.

సినిమా చూసి వెళ్లిపోతే సరిపోయేది - హంగామా వల్లే ఇదంతా: రేవంత్‌రెడ్డి

'సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి, షూటింగ్​కు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు" అని సినిమా ప్రముఖులకు సీఎం రేవంత్​ రెడ్డి హెచ్చరికలు పంపారు. తాను కుర్చీలో ఉన్నంత వరకు ఇలాంటి ఘటనలు ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పారు.

పోలీసులు వద్దన్నా వచ్చారు :సంధ్య థియేటర్​ యాజమాన్యం ఇచ్చిన లేఖను తిరస్కరించామని సీఎం రేవంత్​ రెడ్డి సభలో చెప్పారు. ఈనెల 2న సంధ్య థియేటర్​ యాజమాన్యం లేఖ ఇస్తే 3న తిరస్కరించామన్నారు. అయినా వాహనం రూఫ్​టాఫ్​ నుంచి చేతులు ఊపుతూ ర్యాలీ చేశారన్నారు. హీరో, హీరోయిన్​, ప్రొడ్యూసర్​ థియేటర్​కు రావొద్దని అప్పుడే చెప్పామన్నారు. కానీ పోలీసులు దరఖాస్తు తిరస్కరించినా రాత్రి 9.30 గంటల సమయంలో హీరో థియేటర్​కు వచ్చారని అందుకే ఈ దారణం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు.

'అందుకే అల్లు అర్జున్ రాలేదు' - బాలుడిని పరామర్శించిన అల్లు అరవింద్

'సీఎం పేరు మర్చిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా' - అల్లు అర్జున్ ఘటనపై కేటీఆర్ ఫైర్

ABOUT THE AUTHOR

...view details