ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉల్లాసంగా, ఉత్సాహంగా!- టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం - Chandrababu Meeting with MPs

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 3:08 PM IST

TDP Chief Chandrababu Meeting with MPs: తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలతో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం నిర్వహించారు. అందుబాటులో లేని ఎంపీలు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

chandrababu_meeting_with_mps
chandrababu_meeting_with_mps (ETV Bharat)

TDP Chief Chandrababu Meeting with MPs:సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలతో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం నిర్వహించారు. అందుబాటులో లేని ఎంపీలు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచినందుకు ఎంపీలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు పార్టీ ఎంపీలతో కలిసి దిల్లీ వెళ్లి రేపటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో హాజరుకానున్నారు.

ABOUT THE AUTHOR

...view details