RTC Bus Hit Auto In Anantapur District Two Died :అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాకెట్ల వద్ద రోడ్డుపై ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రాకెట్లకు చెందిన బూసేప్ప (55), హనుమక్క (72) గా గుర్తించారు.
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు- ఇద్దరు మృతి - RTC Bus Hit Auto In Anantapur District Two Died - RTC BUS HIT AUTO IN ANANTAPUR DISTRICT TWO DIED
RTC Bus Hit Auto In Anantapur District Two Died : రోడ్డు ప్రమాదాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. వాహనం నడిపేవారు అప్రమత్తంగా ఉండి అమాయకుల ప్రాణాలకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి. అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు ఆటోని ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.

rtc_bus_hit_auto_in_anantapur_district_two_died (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 5, 2024, 3:54 PM IST
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు- ఇద్దరు మృతి (ETV Bharat)
వీరిద్దరూ కూరగాయలు కొనుగోలు చేయడానికి ఆటోలో ఉరవకొండకు వస్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఉరవకొండ పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.