ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రానికి వందే భారత్ స్లీపర్ - ఆ రెండు మార్గాల్లో కొత్త రైళ్లు - VANDE BHARAT SLEEPER TRAINS

రైల్వే ప్రతిపాదనలు వెల్లడించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

vande_bharat_sleeper_train_coach
vande_bharat_sleeper_train_coach (ETV bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 7, 2025, 4:58 PM IST

Vande Bharat sleeper trains :రాష్ట్రానికి కొత్తగా మరో రెండు వందేభారత్‌ రైళ్లు రానున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రైళ్ల ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర మంత్రి పరిశీలనలో ఉన్నట్లు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ వెల్లడించారు. అదే విధంగా వారణాసికి కొత్త రైలు ఏర్పాటుపైనా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త రైలు మార్గాల అంశంపై స్పందిస్తూ వచ్చే బడ్జెట్‌లో మచిలీపట్నం - నరసాపురం, నరసాపురం - కోటిపల్లి కొత్త రైల్వే లైన్లకు నిధులు కేటాయించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

విశాఖకు మోదీ రాక - రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందా?!

ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల మీదుగా ఇప్పటికే వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికుల నుంచి స్పందన మేరకు ఇటీవల మరికొన్ని కొత్త వందేభారత్ రైళ్ల కోసం ఏపీకి చెందిన ఎంపీలు రైల్వేమంత్రికి విన్నవించారు. దీంతో కూడా ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని ఎంపీలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా కొత్తగా మరో రెండు వందేభారత్ రైళ్లు తెరపైకి వచ్చాయి.

నరసాపురం - వారణాశి మధ్య కొత్త రైలు వచ్చే అవకాశం ఉందంటూ కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ రైల్వే లైన్‌లతో పాటుగా వందేభారత్ రైళ్ల ప్రతిపాదనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నరసాపురం - సికింద్రాబాద్‌ మధ్య వందేభారత్‌ రైలు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. త్వరలో భీమవరం -–చెన్నై మధ్య మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. నరసాపురం - మచిలీపట్నం మధ్య నడపనున్న కొత్త రైలు మార్గం పనులకు సంబంధించి డీపీఆర్ ఇప్పటికే సిద్ధంగా ఉందని వెల్లడించారు.

వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. నిధులు, భూ సేకరణ సమస్య నరసాపురం - కోటిపల్లి రైల్వే లైన్‌ జాప్యానికి ప్రధాన కారణం అని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటాలో ఐదేళ్లలో రూపాయి కూడా చెల్లించకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు. ఈ సారి కేంద్ర బడ్జెట్‌లో విడుదలయ్యే నిధులతో ఈ పనులు మరింత వేగవంతం అవుతాయని శ్రీనివాసవర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.

పారిశ్రామిక అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా వందేభారత్ రైళ్లు నడపాలని రాష్ట్రానికి చెందిన ఎంపీలు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విన్నవించారు. విజయవాడ నుంచి బెంగళూరు, విశాఖపట్నం నుంచి చెన్నై నగరాలకు వందేభారత్ రైళ్లను నడపాలని కోరగా ఈ మేరకు రైల్వేశాఖ కూడా ఆలోచన చేస్తోందని, వందేభారత్ స్లీపర్ రైళ్లను కూడా ఏపీలో నడిపే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త రైలు మార్గాలకు నిధులు మంజూరు చేయడంతో పాటు ఇప్పటికే ప్రారంభమైన పనులు వేగవంతం చేయాలని రైల్వేమంత్రిని కోరారు. ఈ సారి బడ్జెట్‌లో మరికొన్ని రైలు మార్గాలకు నిధులు కేటాయించే అవకాశం ఉందంటున్నారు.

రైలు ప్రయాణికులకు గుడ్​న్యూస్​ - ఆ రైళ్లలో జనరల్​ బోగీల సంఖ్య పెంపు!

విశాఖ రైల్వే జోన్​ ఏర్పాటుకు ముందడుగు- టెండర్లును పిలిచిన అధికారులు

ABOUT THE AUTHOR

...view details