ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొలిసారి ఎన్నికై కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెమ్మసాని చంద్రశేఖర్‌ - Pemmasani took oath as Union Minister - PEMMASANI TOOK OATH AS UNION MINISTER

Pemmasani Chandrasekhar took Oath as Union Minister : ఏపీ నుంచి తెలుగుదేశం తరఫున కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు.

Pemmasani Chandrasekhar took Oath as Union Minister
Pemmasani Chandrasekhar took Oath as Union Minister (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 9, 2024, 10:34 PM IST

Updated : Jun 9, 2024, 10:39 PM IST

Pemmasani Chandrasekhar took Oath as Union Minister : కేంద్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం దిల్లీలో కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నుంచి కేంద్ర మంత్రిగా గుంటూరు ఎంపీగా గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు హాజరయ్యారు. ఇక ఏపీ నుంచి కేంద్రమంత్రులుగా పెమ్మసానితోపాటు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, శ్రీనివాసవర్మకు ప్రమాణ స్వీకారం చేశారు.

పెమ్మసాని విజయ ప్రస్థానం..

తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి గుంటూరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మసాని అమెరికాలో స్థిరపడి వైద్యరంగంలో ఉన్నతస్థానాలకు ఎదిగారు. సొంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది కేంద్ర క్యాబినెట్‌లో చోటు సంపాదించారు.

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్మోహన్‌నాయుడు - Rammohan Naidu Takes Oath as Cabinet Minister

ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన ఆనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం 'యు వరల్డ్‌' ఆన్‌లైన్‌ సంస్థను ప్రారంభించి స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించారు. ఆ తర్వాత ఈ సంస్థ వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తూ అతికొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.

రాష్ట్రం నుంచి మరొకరికి కేంద్రమంత్రి వర్గంలో చోటు! - Narasapuram MP Srinivas varma

గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్‌ తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు. ఎంబీబీఎస్ , ఎండీ పూర్తిచేసిన చంద్రశేఖర్‌ వయసు 47 ఏళ్లు. భార్య డాక్టర్‌ శ్రీరత్న. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్‌ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత ప్రజలకు చిరపరిచితులు. చంద్రశేఖర్‌ ఎంసెట్‌లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. పీజీ చదవడం కోసం అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్‌ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్‌ పూర్తి చేయడంలో వసతి, శిక్షణ కోసం అధిక వ్యయం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో జనరల్‌ గైసింగర్‌ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు.

అమెరికాలోని డాలస్‌లో పెమ్మసాని ఫౌండేషన్‌ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. తొలి నుంచి తెలుగుదేశంతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్‌ ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్‌ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖారరైనప్పటికీ అప్పటి రాజకీయ పరిణామాల నడుమ రాయపాటి సాంబశివరావు బరిలోకి దిగారు.

రాష్ట్రవ్యాప్తంగా రామోజీరావుకు కన్నీటి వీడ్కోలు - Tribute to Ramoji Rao in across AP

తొలిసారి ఎన్నికై కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పెమ్మసాని చంద్రశేఖర్‌ (ETV Bharat)
Last Updated : Jun 9, 2024, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details