ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు ఆర్థిక ప్రయోజనం - పలు కంపెనీలతో ఒప్పందం - ANANTHA HORTICULTURE CONCLAVE 2025

ఉద్యాన పంటల రైతులకు ప్రయోజనం చేకూర్చే జాతీయస్థాయి సదస్సు - జిల్లాలో రైతుల నుంచి ఉద్యాన పంటల ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం

ANANTHA HORTICULTURE CONCLAVE 2025
ANANTHA HORTICULTURE CONCLAVE 2025 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2025, 9:50 PM IST

Anantha Horticulture Conclave-2025 In Ananthapur: ఉద్యాన పంటల రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్రంలో తొలిసారిగా అనంతపురంలో జాతీయస్థాయి సదస్సు జరిగింది. ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు నాణ్యమైన దిగుబడి సాధించడానికి సాంకేతిక తోడ్పాటుతో పండించిన ఉత్పత్తిని మంచి ధరకు విక్రయించే మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా ఈ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు వచ్చిన కంపెనీల్లో తొలి ప్రాధాన్యతగా రాష్ట్రానికి చెందిన ఏడు సంస్థలతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా కేవలం రైతులకు ఆర్థిక ప్రయోజనం, కంపెనీలకు నాణ్యమైన ఉద్యాన పంటల ఉత్పత్తులు అందించేలా ఈ ఒప్పందం చేసుకున్నారు.

ఉద్యాన రైతుల కోసం జాతీయస్థాయి సదస్సు:అనంతపురంలో'అనంత హార్టికల్చర్ కాన్ క్లేవ్-2025' పేరిట తొలిసారిగా జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా నాణ్యమైన పండ్లు, కూరగాయలు సాగుచేస్తున్న రైతులను సదస్సుకు ఆహ్వానించి వారి ఉత్పత్తులకు మంచి ధర ఇప్పించే ప్రముఖ సంస్థలను పిలిపించారు. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలతో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అనంత హార్టికల్చర్ కన్ క్లేవ్​ను నిర్వహించారు. దేశవ్యాప్తంగా రైతులకు వివిధ రకాల సేవలు అందిస్తున్న 104 కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు వచ్చారు. జిల్లాలో రైతుల నుంచి ఉద్యాన పంటల ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఆయా సంస్థల ప్రతినిధులకు తెలియజేశారు.

7 కంపెనీల ప్రతినిధులతో ఎంవోయూ: సాగుకు అవసరమైన డ్రిప్, స్ప్రింక్లర్ , యంత్ర పరికరాలు ప్రభుత్వం రాయితీతో ఇస్తుందని లఘు చిత్ర ప్రదర్శన ద్వారా చెప్పారు. ఏడు కంపెనీల ప్రతినిధులు తమ సంస్థల ద్వారా సేవలందించడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం అనుకూలంగా ఉన్నందున తాము రైతులతో కలిసి పనిచేయడానికి ఎంవోయూ చేసుకున్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు చెప్పారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరై ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రాయితీలను కంపెనీల ప్రతినిధులకు వివరించారు.

రెండు నెలల్లో క్షేత్రస్థాయిలో సేవలు: ప్రకృతి ఎన్ని సార్లు నష్టపరిచినా ఎదురునిలిచి దిగుబడులు సాధిస్తున్న అనంతపురం రైతుల గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా అన్నారు. బ్రాండ్ అనేది ప్రతి వస్తువుకు అవసరమని ఏపీకి బ్రాండ్ సీఎం చంద్రబాబు మాత్రమేనని ఆయన ఉద్ఙాటించారు. ఏడాది లోపే హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేస్తామని పయ్యావుల కేశవ్ రైతులకు హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చాలా చేస్తోందని, అనంతపురం జిల్లాలో నీటి పారుదల వ్యవస్థ ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరివ్వడమే తమ లక్ష్యమని రైతులకు, కంపెనీల ప్రతినిధులకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రైతులకు డ్రిప్ పరికరాలు కూడా ఇవ్వలేకపోయిందని పయ్యావుల ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఎంవోయూ చేసుకున్న ఏడు సంస్థల ప్రతినిధులు మరో రెండు నెలల్లో క్షేత్రస్థాయికి వెళ్లి సేవలు ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు. తొలుత అరటి నార నుంచి వస్త్రాలు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు శిక్షణ ప్రారంభం కానుందని అధికారులు తెలియజేశారు.

రైతుల పంటల సాగుకు అవసరమైన డ్రిప్, స్పింక్లర్, వ్యవసాయ యంత్ర పరికరాలు వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం రాయితీతో ఇస్తుంది. మా సంస్థల ద్వారా సేవలందించడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్​లు ప్రభుత్వం తరపున ఆయా సంస్థలతో ఒప్పందంపై సంతకాలు చేశారు. తాము ఇప్పటికే రైతులతో కలిసి పని చేస్తున్నామని, ప్రభుత్వం రైతులకు అనుకూలంగా ఉన్నందున తాము కలిసి పని చేయడానికి ఎంఓయూ చేసుకున్నాం.

''అనంతపురం జిల్లా రైతుల రుణం తీర్చుకోవడమే మా ప్రధాన లక్ష్యం. ఈ జిల్లాలో 24 పంటలు పండినట్లయితే ఆ పంటను ఎలా మార్కెటింగ్ చేయాలనే దానిపై మేము పూర్తిగా దృష్టి పెట్టాం. అనంతపురంలో కర్భూజాకు ఎంతో బ్రాండ్ ఉంది. అదే విధంగా అనంతపురం మామిడి అంటే దానికో ప్రత్యేత స్థానముంది. దేశ విదేశాల్లో ఇక్కడి ఉద్యానపంటలకు మంచి గిరాకీ ఉంది'' -పయ్యావుల కేశవ్, మంత్రి

''సిద్ధార్థ కోల్డ్​కేర్ ప్రైవేట్​ లిమిటెడ్ తరపున మ్యాంగో, బనానా, చిల్లీ పేస్ట్​ ఇవన్నీ తయారు చేయడానికి చూస్తున్నాం'' -సిద్ధార్థ రెడ్డి, ఎండీ, సిద్ధార్థ కోల్డ్​కేర్ ప్రైవేట్​ లిమిటెడ్​

''రైతులకు ఈ కెపాసిటీ బిల్డింగా ప్రోగ్రాం చేయడమే కాకుండా వారి ఉత్పత్తులను వారి పొలాలకు వెళ్లి పరిశీలిస్తాం. ప్రధానంగా బొబ్బాయి, మ్యాంగో, బనానా ఈ మూడు పంటల మీద మా సంస్థ గ్రీన్ గురుకులం ఎన్​ఎల్పీ పని చేస్తుంది'' -రోజాచంద్​, గ్రీన్ గురుకులం ఎన్​ఎల్పీ

No Rains in Anantapur District: చినుకు జాడ లేదయే.. సాగు చేసేది ఎలా..? ఉమ్మడి అనంత రైతన్న ఆవేదన

Water apple cultivation : మిశ్రమ ఉద్యాన పంటగా వాటర్ యాపిల్.. లాభాల వైపు రైతుల పరుగు..

ABOUT THE AUTHOR

...view details