ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎం.కె. మీనా నియామకం - MK Meena to Excise Department - MK MEENA TO EXCISE DEPARTMENT

MUKESH KUMAR MEENA: ఎక్సైజ్​శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్​ ఐఏఎస్​ అధికారి ముఖేష్​ కుమార్​ మీనాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్​ ఉత్తర్వులు జారీ చేశారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

MK MEENA TO EXCISE DEPARTMENT
MK MEENA TO EXCISE DEPARTMENT (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 8:00 AM IST

Updated : Jul 13, 2024, 12:36 PM IST

Mukesh Kumar Meena As Principal Secretary to Revenue Excise :సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగానూ ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం ఏపీ సీఈఓ బాధ్యతల నుంచి ముఖేష్ కుమార్ మీనా రిలీవ్ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Senior IAS Officer Vivek Yadav as AP CEO :రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్‌ యాదవ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. వెంటనే బాధ్యతలు స్వీకరించాలని పేర్కొంది. వివేక్‌యాదవ్‌ బాధ్యతలు తీసుకోగానే ఇప్పటివరకు సీఈవోగా ఉన్న ముకేష్‌కుమార్‌ మీనా రిలీవ్‌ అయ్యారు.

Last Updated : Jul 13, 2024, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details