ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహాశివరాత్రి పర్వదినం - శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు - MAHASHIVRATRI CELEBRATIONS 2025

ఏపీలో అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు - భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం

Mahashivratri Celebrations 2025
Mahashivratri Celebrations 2025 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2025, 9:38 PM IST

Mahashivratri Celebrations 2025 :తలచినంతనే వశమయ్యే భక్తవత్సలుడు అడిగినంతలో కరుణించే దయామయుడు నిర్గుణుడు నిర్వికారుడు. ఆర్తజనరక్షకుడు అసురులకూ వరాలిచ్చే భోళాశంకరుడు. సత్యస్వరూపుడు ఆనందతాండవుడు ఆలిని తనలో ఇముడ్చుకున్న అర్ధనారీశ్వరుడు. మనిషిలోని శక్తిని ఉప్పొంగించి ఆధ్యాత్మిక శిఖరానికి చేర్చే పర్వదినమే మహా శివరాత్రి. ఈ విశిష్ట రోజున పరమశివుడిని పూజిస్తే కుటుంబం చల్లగా ఉంటుందని భక్తజనం నమ్ముతారు. ఈ పర్వదినం ఉపవాస, జాగరణలే కాదు మరెన్నో ఆధ్యాత్మిక, జీవన సందేశాలున్న సుదినం. ఆది అంతం లేని లింగరూపంలో అవతరించిన పరమేశ్వరుడిని బ్రహ్మా, మురారి, సురులు అర్చించిన రోజు.

రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రి సందడి నెలకొంది. నీలకంఠుడి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. దీంతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. దేవాలయాల ప్రాంగణాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. స్వామివారి దర్శనభాగ్యంతో భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. శివుడికి పూజలు, రుద్రాభిషేకాలు చేస్తున్నారు.వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

Shivratri Celebrations in Srisailam 2025 : ఈ క్రమంలోనే పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవం వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు భ్రమరాంబ - మల్లిఖార్జున స్వామి వారి కల్యాణం జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్‌ అందిస్తారు.

'హరహర మహాదేవ శంభో శంకర' - శివనామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు

కోటప్పకొండపై వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు - వేడుకల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

ABOUT THE AUTHOR

...view details