ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 4 hours ago

ETV Bharat / state

ఏపీకి లులు గ్రూప్ - సీఎం చంద్రబాబుతో ఛైర్మన్ యూసఫ్ అలీ భేటీ - Lulu Chairman Meets Chandrababu

Yusuff Ali Met CM Chandrababu : రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పెట్టుబడుల ఆకర్షణ దిశగా అడుగులు వేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎంతో లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్​లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై ఇరువురూ చర్చించారు.

Lulu Chairman Meets Chandrababu
Lulu Chairman Meets Chandrababu (ETV Bharat)

Lulu Group Chairman Meets Chandrababu :కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో మధ్యలో ఆగిపోయిన చాలా పరిశ్రమలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. కొత్త పరిశ్రమలను స్థాపించేందుకు కూడా సర్కార్ సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో ఇప్పటికే సంప్రదింపులు కొనసాగుతుండగా, మరోవైపు నూతన ఇండ్రస్టీస్​, పెట్టుబడులు రాబట్టేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో ఐదు సంవత్సరాలుగా ఉపాధి అవకాశాలు లేక నానావస్థలు పడిన నిరుద్యోగులకు కూటమి రాకతో ఆశలు చిగురిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి తరిమేసిన లులు సంస్థ సీఎం చంద్రబాబు చొరవతో మళ్లీ తిరిగి ఏపీకి రానుంది. ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రితో లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్​లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. విశాఖలో మాల్, హైపర్‌ మార్కెట్ ఏర్పాటుపై చంద్రబాబుతో వారు చర్చించారు. విజయవాడ, వైజాగ్​, తిరుపతిలోనూ మల్టీప్లెక్స్‌ల ఏర్పాటుపై చర్చ సాగింది.

Lulu Group Investments in AP : లులు బృందంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ అభివృద్ధిలో పాల్గొనే భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణ పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు. లులు ప్రతినిధులకు పూర్తిస్థాయి మద్దతిస్తామని చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటించారు.

మరోవైపు రాష్ట్రంలో పంప్డ్‌ స్టోరేజి విద్యుత్‌ ప్రాజెక్టు (పీఎస్‌పీ)ల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వానికి చెందిన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్‌కో, నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌పీసీ)లు భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనిద్వారా మొత్తంగా రూ.1,00,106 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్​ రానున్నాయి. ప్రతిపాదిత పీఎస్పీలను రెండుదశల్లో పూర్తి చేయనున్నారు. వీటి ద్వారా కొత్తగా 5,070 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది.

ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎన్‌హెచ్‌పీసీ వీసీ, ఎండీ రాజ్‌కుమార్‌ చౌధరీ, జెన్‌కో ఎండీ చక్రధర్‌బాబు ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్​లో పీఎస్పీలు, పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను (సౌర/నీటిపై తేలియాడే సౌర విద్యుత్‌/ పవన విద్యుత్‌) రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. ప్రాజెక్టుల ఏర్పాటు వ్యయాన్ని సమానంగా భరించనున్నాయి.

మల్లవల్లికి కొత్త పరిశ్రమలు - నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు - Unemployees Interview at Mallavalli

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details