Govt Orders Increasing Scope of AP CRDA:ఏపీ సీఆర్డీఏ (Andhra Pradesh Capital Region Development Authority) పరిధిని 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలలో విలీనం చేసిన విస్తీర్ణం తిరిగి సీఆర్డీఏలో కలుపుతూ ఆదేశాలు వెలువడ్డాయి. సత్తెనపల్లి మున్సిపాలిటీ, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కలిపిన 6 మండలాల్లోని 92 గ్రామాల 1,069 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం సీఆర్డిఏలో కలవనుంది. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని 562 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కూడా సీఆర్డీఏలో విలీనం అవనుంది. మొత్తంగా 1,631 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తిరిగి సీఆర్డీఏలో కలుపుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి కె. కన్నబాబు ఉత్తర్వులు జారీ చేసారు.
ఏపీ సీఆర్డీఏ పరిధి పెంపు - 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ఉత్తర్వులు - GOVT INCREASING SCOPE OF AP CRDA
సీఆర్డీఏ పరిధిని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - పల్నాడు, బాపట్లలో విలీనం చేసిన ప్రాంతాలను సీఆర్డీఏలో కలుపుతూ ఉత్తర్వులు
crda_jurisdiction_restored (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 12, 2024, 10:30 PM IST