ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 3:33 PM IST

ETV Bharat / state

మంగళగిరిలో బసవతారకం ఇండో- అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి ఉచిత నిర్ధారణ శిబిరం

Free Cancer Screening Camp By Nara Lokesh In Mangalagiri : క్యాన్సర్​ కారణంగా ప్రాణ నష్టం జరకూడదని. ప్రతీ ఒక్కరు క్యాన్సర్​ నిర్ధరణ పరీక్షలు చేసుకుని తగిన సమయంతో చికిత్స పొందాలనే ఉద్దేశ్యంతో స్వర్వీయ ఎన్​టీఆర్​ బసవతారకం ఆస్పత్రిని నెలకొల్పారు. ఈ అధునాతన నాణ్యత కలిగిన వైద్య సదుపాయాలతో మంగళగిరిలో క్యాన్సర్​ ఉచిత నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశారు.​

free_cancer_screening_camp_by_nara_lokesh_in_mangalagiri
free_cancer_screening_camp_by_nara_lokesh_in_mangalagiri

Free Cancer Screening Camp By Nara Lokesh In Mangalagiri : నాణ్యమైన క్యాన్సర్‌ నిర్ధారణ సేవలు ఉచితంగా అందించడం గర్వంగా ఉందని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. తాత ఎన్టీఆర్​ (NTR) స్ఫూర్తి, తండ్రి బాలకృష్ణ (Balakrishna) ప్రోత్సాహంతో ఉచిత క్యాన్సర్​ నిర్ధారణ, చికిత్స సేవలు కొనసాగిస్తున్నామన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ నేతృత్వంలో బసవతారకం ఇండో- అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్‌ నిర్ధారణ శిబిరాన్ని నారా బ్రాహ్మణి (Nara Brahmani), ఆమె తల్లి వసుంధర (Nandamuri Vasundhara) తో కలిసి ప్రారంభించారు.

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ సూచన మేరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం

'సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే స్పూర్తితో ఎన్టీఆర్ (NTR) స్థాపించిన కాన్సర్ ఆసుపత్రికి నందమూరి బాలకృష్ణ ఛైర్మన్​గా కొనసాగుతూ పేద ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్నారు. ఎందరో జీవితాల్ని చిదిమేస్తున్న కాన్సర్ పట్ల ప్రతీ ఒక్కరికీ అవగాహన అవసరం. మా కుటుంబంలో మా నాయనమ్మ కాన్సర్ బారిన పడినందు వల్ల ఇంకెవ్వరికీ ఆ బాధ ఉండకూడదనే ఉద్దేశంతో ఎంతో మంది ప్రజలకు ఉచితంగా అధునాతనమైన సేవలు అందిస్తున్నాము. మంగళగిరి ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.' - నారా బ్రాహ్మణి, లోకేష్ సతీమణి

'ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్' శిబిరాన్ని సందర్శించిన బాలకృష్ణ- పేదలకు వైద్య సేవలు కొనసాగిస్తామని ప్రకటన

Basavatarakam Hospital Free cancer screening camp :శిబిరం ద్వారా అందే వైద్య సేవలు, సంచార స్క్రీనింగ్‌ వాహనం పనితీరును బ్రాహ్మణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ ఉచిత వైద్యశిబిరాన్ని మంగళగిరి ప్రజలు (People) సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంకితభావంతో కూడిన వైద్యుల (Doctors) బృందం నిరంతరం సేవలందించేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. బసవతారకం (Basavatarakam) ఇండో అమెరికన్ కాన్సర్ (cancer) ఆసుపత్రి ద్వారా ఇప్పటి వరకూ 2లక్షల మందికి నిర్దారణ పరీక్షలు చేశామని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రి సీఈవో కృష్ణయ్య తెలిపారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సరైన వైద్యంతో బాగు చేసుకోవచ్చని బసవతారకం ఇండో- అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి సీఈవో కృష్ణయ్య (CEO Krishnaiah) తెలిపారు.

ఎన్టీఆర్ ట్రస్ట్​ భవన్​లో మెగా హెల్త్ క్యాంప్​ - చిన్నారులకు బహుమతులు పంచిన నారా బ్రహ్మణి

లాభాపేక్ష లేకుండా రోగులకు చికిత్స అందించడమే లక్ష్యం : బసవతారకం ఆస్పత్రి సీఈవో

మంగళగిరిలో ఉచిత క్యాన్సర్​ నిర్ధారణ శిబిరం

ABOUT THE AUTHOR

...view details