ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏపీ ప్రజలు అదృష్టవంతులు' - అన్న క్యాంటిన్​లో భోజనం చేసిన అమ్మరాజశేఖర్​ - AMMA RAJASEKHAR IN ANNA CANTEEN

విశాఖ అన్న క్యాంటీన్​లో భోజనం చేసిన అమ్మరాజశేఖర్, ముక్కు అవినాష్​

director_amma_rajasekhar_eat_food_in_anna_canteen_in_visakha
director_amma_rajasekhar_eat_food_in_anna_canteen_in_visakha (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2025, 12:17 PM IST

Updated : Feb 7, 2025, 2:53 PM IST

Director Amma Rajasekhar Eat Food in Anna Canteen in Visakha : ‘తల’ సినిమా ప్రమోషన్స్‌ కోసం గురువారం విశాఖ నగరానికి వచ్చిన నృత్య, చిత్ర దర్శకుడు అమ్మరాజశేఖర్, హీరో రాగిణిరాజ్, నటుడు ముక్కు అవినాష్‌ మంచి హోటల్‌ చూసి భోజనం చేయాలని కారులో బయలుదేరారు. రామాటాకీస్‌ కూడలి సమీపంలోని అన్న క్యాంటీన్‌ వద్ద జనం గుమిగూడి ఉండడంతో అక్కడకు వెళ్లి భోజనం చేశారు. అందరిలాగే క్యూలో నిల్చున్నారు. ఇంత తక్కువ ధరకు ‘టీ’ కూడా రాదు భోజనం లభిస్తుందని అక్కడి వారితో సంభాషించారు.

అన్న క్యాంటీన్లో ఐదు రూపాయల భోజనం ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. ఇలా అందరితో కలిసి భోజనం చేయడం తాను జీవితంలో మర్చిపోలేనని అమ్మరాజశేఖర్ అన్నారు. ఆకలి సమయంలో అన్న క్యాంటీన్లో అన్నం తినడం ఎంతో ఆనందాన్నిచ్చిందని హీరో రాగిణి రాజ్ అన్నారు. జబర్దస్త్ కమెడియన్ నటుడు ముక్కు అవినాష్ అక్కడివారితో ఎంతో సరదాగా ముచ్చటించారు. ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం కృషిని ప్రశంసించారు.

‘అన్న క్యాంటీన్‌లో ఇంత మంచి భోజనం లభిస్తుందంటే నమ్మలేకపోతున్నాం. అదీ రూ.5లకే. మీకు మంచి ప్రభుత్వం ఉంది. ఏపీ ప్రజలు అదృష్టవంతులు’ -నృత్య, చిత్ర దర్శకుడు అమ్మరాజశేఖర్‌

గుడివాడలో 'అన్న క్యాంటీన్‌' పునః ప్రారంభం - పేదలతో కలిసి సీఎం చంద్రబాబు దంపతుల భోజనం - CM CBN Inaugurated Anna Canteen

రెండో విడత అన్న క్యాంటీన్లు ప్రారంభం- స్వయంగా అన్నం వడ్డించిన సీఎం - second phase of Anna Canteens

Last Updated : Feb 7, 2025, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details