ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నదుల అనుసంధానానికి సహకరించండి - కేంద్రమంత్రులతో సీఎం భేటీ - CHANDRABABU MET CENTRAL MINISTERS

వరద బాధితులను ఆదుకునేందుకు ఎస్‌జీఎస్‌టీపై 1% అదనపు సర్‌ఛార్జీకి వెసులుబాటు ఇవ్వమని కేంద్ర ఆర్థికమంత్రిని కోరిన చంద్రబాబు

CHANDRABABU_MET_CENTRAL_MINISTERS
CHANDRABABU_MET_CENTRAL_MINISTERS (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2024, 7:28 AM IST

Updated : Nov 16, 2024, 8:16 AM IST

CM Chandrababu Met Central Ministers :వ్యవసాయానికి జీవనాధారమైన సాగునీటికి నదులు అనుసంధానమే ఏకైక పరిష్కార మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గోదావరి- కృష్ణా- పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోనున్నాయని దీనికి కేంద్రం ఆర్థికంగా అండగా నిలబడాలని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్​ను ఆయన కోరారు. అలాగే దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీ సంస్థలను ఏపీకి పంపాలని జైశంకర్‌ను కలిసి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చ :ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందుస్థాన్‌ టైమ్స్‌ శత వసంతోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న నాయకత్వ సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం దిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచే నేరుగా వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో సమావేశమయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడను ఆదుకునేందుకు రాష్ట్ర జీఎస్టీపై తాత్కాలికంగా ఒక శాతం అదనపు సర్‌ఛార్జీని విధించేందుకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తిచేశారు .

రాష్ట్రం అప్పు 9.74 లక్షల కోట్లు - ఎవరైనా కాదంటే రండి తేల్చుతా : సీఎం చంద్రబాబు

గోదావరి- కృష్ణా- పెన్నా అనుసంధానమే లక్ష్యం :కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌ను ఏపీలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనివల్ల రాష్ట్ర రూపురేఖలే మారిపోనున్నాయని చంద్రబాబు అన్నారు. గోదావరి-కృష్ణా-పెన్నాలను అనుసంధానించి ఏపీని కరవు రహితంగా మారుస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానానికి కేంద్రం సాయం చేస్తున్నట్లుగానే ఏపీకి సహకరించాలని నిర్మలాను కోరారు. ప్రస్తుతం పోలవరం ద్వారా గోదావరి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు తెస్తున్నామని అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ కుడికాల్వలోకి ఎత్తిపోసి బనకచర్ల మీదుగా రాయలసీమకు తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. 60 వేల కోట్ల వరకు ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్‌ కు కేంద్రం సహకరించాలని చంద్రబాబు కోరగా నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

'రాష్ట్రం వెంటిలేటర్​పై ఉంది - ఐదేళ్లూ అడవి పందుల తరహాలో మేశారు'

ఏపీలో విదేశీ సంస్థల పెట్టుబడులు :అనంతరం మరో కేంద్రమంత్రి జైశంకర్‌తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రభావం దేశంపై ఏవిధంగా ఉండబోతుందని చర్చించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్‌ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని కోరారు. దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలను ముందుగా ఏపీకి తీసుకురావాలని చంద్రబాబు కోరినట్లు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు.

దిల్లీలో చంద్రబాబు - పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చ

Last Updated : Nov 16, 2024, 8:16 AM IST

ABOUT THE AUTHOR

...view details