Assembly House Committee inquiry on Visakha Dairy : విశాఖ డెయిరీలో అవకతవకలపై ఏర్పాటైన అసెంబ్లీ సభా సంఘం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. సభా సంఘం ఛైర్మన్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో, సభ్యులు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, గౌతు శిరీష, ఆర్ వి ఎస్ కె కె రంగారావు, దాట్ల సుబ్బరాజు, బొండా ఉమామహేశ్వరరావు ఈ ఉదయం విశాఖ చేరుకున్నారు. బస చేసిన హోటల్ నుంచి అందరూ విశాఖ డెయిరీ చేరుకున్నారు. అధికారులతో కలిసి విశాఖ డెయిరీని ప్రత్యక్షంగా పరిశీలించారు. సుమారు ముడు గంటలు డైయిరీ పై సమీక్ష నిర్వహించారు. అలాగే జిల్లా అధికారులతో సభ సంఘం సమీక్ష నిర్వహించింది.
విశాఖ డెయిరీ పరిశీలించిన అనంతరం సభా సంఘం చైర్మన్ జ్యోతులు నెహ్రూ మీడియాతో మాట్లాడారు. స్పీకర్ ఆదేశాలతోనే విశాఖ డెయిరీ పరిశీలించామన్నారు. పరిశీలన తరవాత మా సందేహాలు మరింత పెరిగాయన్నారు. వీటి మీద ఒక నిపుణుల కమిటీ వేయాలని తెలిపారు. అలాగే విశాఖ డెయిరీ మీద ఆడిట్ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తమ పరిశీలన సమయంలో విశాఖ డెయిరీ చైర్మన్ హాజరు కాలేదని, కేవలం ఎండీ మాత్రమే పాల్గొన్నారని వెల్లడించారు. విశాఖ డెయిరీ నాలుగు జిల్లాలో పరిధిలో ఉంది కనుక నాలుగు జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామన్నారు. పాడి రైతులకు నష్టం జరగకుండా నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కమిటీ నివేదికను అసెంబ్లీకి అందిస్తామని జ్యోతుల నెహ్రూ తెలిపారు.
పాడి రైతులు నష్టపోకుండా చూస్తాం: జ్యోతుల నెహ్రూ