A Father Sell Child in Guntur : పుట్టగానే తల్లి పొత్తిళ్లలో సురక్షితంగా ఉండాల్సిన ఆ చిన్నారి మాతృత్వపు మమకారానికి దూరమైంది. మరోవైపు ఆ పాపకు అండంగా నిలవాల్సిన తండ్రే అంగడి బొమ్మలా ఇతరులకు అమ్మేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 11 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Wed Sep 11 2024- నాన్న నన్ను ఎందుకు అమ్మేశావ్ - నేనేం తప్పు చేశాను? - Baby Girl Sale in Guntur
By Andhra Pradesh Live News Desk
Published : Sep 11, 2024, 9:46 AM IST
|Updated : Sep 11, 2024, 10:39 PM IST
నాన్న నన్ను ఎందుకు అమ్మేశావ్ - నేనేం తప్పు చేశాను? - Baby Girl Sale in Guntur
వరద బాధితులకు మేమున్నాం అంటూ విరాళాల వెల్లువ - వారందరికీ లోకేశ్ కృతజ్ఞతలు - Donations To AP Flood Victims
Donations to AP CMRF : రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. తాజాగా సచివాలయంలోనే మంత్రి లోకేశ్ను కలిసిన పలువురు విరాళాల చెక్కులను అందజేశారు. వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. | Read More
ఖైరతాబాద్ గణేశుడికి 280 జంటలతో రుద్రహోమం - భారీగా తరలివచ్చిన భక్తులు - KHAIRATABAD GANESH RUDRA HOMAM
Khairatabad Ganesh Pooja 2024 : వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణేశుడి వద్ద లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలో ఏకంగా 280 జంటలు పాల్గొన్నాయి. | Read More
నాలుగో రోజూ ఏలేరు వరద ప్రభావం - పిఠాపురం నియోజకవర్గంలో స్తంభించిన రాకపోకలు - Yeleru floods in Pithapuram
Yeleru Flood is Having Severe Impact in Pithapuram Constituency : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నాలుగో రోజూ ఏలేరు వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. పొలాలు నీటిలోనే నానుతున్నాయి. గృహాలు, దుకాణాలు, ఆలయాలు సైతం నీటమునిగాయి. గ్రామాల్లో పశువులను జాతీయ రహదారి వద్దకు తీసుకువచ్చి సంరక్షించుకుంటున్నారు. రాకపోకలు స్తంభించాయి. | Read More
రాష్ట్రంలో సెబ్ రద్దు - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - SEB Cancellation in AP
SEB Abolishing in AP : ఏపీలో సెబ్ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. | Read More
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన - ఈ నెల 17లోపు పరిహారం - Chandrababu Tour Godavari Districts
Chandrababu Visit Flood Areas : ఓ వైపు వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుంటే, మరోవైపు బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోయేలా విధ్వంసానికి వైఎస్సార్సీపీ కుట్ర పన్నిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. గత సర్కార్ తప్పిదం వల్లే విజయవాడ అతలాకుతలమైందని విమర్శించారు. ఐదేళ్ల దుర్మార్గ పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయన్నారు. | Read More
డబుల్ సెంచరీ దాటిన హైడ్రా కూల్చివేతలు - తెలంగాణ ప్రభుత్వానికి లేటెస్ట్ రిపోర్ట్ - HYDRA Demolitions Latest Report
Hydra Demolition Details in Hyderabad : గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ పరిసరాల్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. మొత్తం 23 ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో కట్టిన 262 అనధికారిక నిర్మాణాలు కూల్చేసినట్టు ప్రభుత్వానికి నివేదించింది. | Read More
పడవల తొలగింపు చర్యలు వేగవంతం- ముక్కలుగా కోసి తొలగించాలంటున్న నిపుణులు - Boat Cutting Process in Barrage
Boat Cutting Process Started in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజ్ వద్ద విధ్వంసం సృష్టించి అక్కడే చిక్కుకుని ఉన్న పడవుల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో ఎత్తి తీయడం సాధ్యపడక పోవడంతో వాటిని ముక్కలు చేయాలని అధికారుల నిర్ణయించారు. | Read More
మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ- ఈ నెలాఖరుతో ముగియనున్న పాత విధానం - Cabinet Meeting on Liquor Policy
Cabinet Sub Committee Meeting on New Liquor Policy : మద్యం పాలసీ రూపకల్పనపై మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశమైంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై అధ్యయనానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి హాజరయ్యారు. | Read More
వరద సహాయక చర్యల్లో అధికారులు- ధాన్యం దండుకుంటున్న మిల్లర్లు- నెల్లూరు జిల్లాలో రైతుల ఆవేదన - No Rate To Paddy In Nellore
No Rate To Paddy In Nellore: వరద సహాయక చర్యల్లో విజయవాడలో అధికార యంత్రాంగం తలమునకలైంది. దీన్నే ఆసరాగా తీసుకున్న మిల్లర్లు, వ్యాపారులు రైతులను దగా చేస్తున్నారు. వారం రోజుల కిందటి వరకు 23వేల రూపాయలు పలికిన పుట్టి ధాన్యం ఒక్కసారిగా 17వేల రూపాయలకు పడిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం ధరలు తగ్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. | Read More
రాష్ట్రంలో భారీగా వరద నష్టం- అంచనాలపై కేంద్ర బృందం పర్యటన - Central Team To Assess Flood Damage
Central Team To Assess Flood Damage in AP: వరద నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం సమావేశం కొనసాగుతోంది. వివిధ శాఖల్లో జరిగిన నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. 6,882 కోట్ల నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా వేసినట్లు వివరించారు. | Read More
వరద తాకిడికి అన్నదాత విలవిల- నీటిపారుదల శాఖకు సవాల్గా గండ్ల పూడ్చివేత - CANALS DAMAGE IN GUNTUR
Severe Damage Canals in Guntur Irrigation Dept. Focus to Revive : ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు, వరదల వల్ల ఎక్కడికక్కడ కాలువలకు గండ్లు పడ్డాయి. చెరువుల కట్టలు తెగిపోయాయి. వరద ముంచెత్తి వ్యవసాయ భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. గండ్లు పూడ్చడం ఇప్పుడు నీటిపారుదల శాఖకు సవాల్ గా మారింది. త్వరగా చర్యలు చేపట్టకపోతే దిగువకు సాగునీరు అందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. | Read More
ప్రభుత్వ, సాప్ట్వేర్ ఉద్యోగులు, సినీ కళాకారులు అంతా ఒకేచోట- రేవ్పార్టీ భగ్నం - rave party in hyderabad
Rave party Busted in Hyderabad : ఓ గెస్ట్హౌస్లో సాప్ట్వేర్ ఉద్యోగులు నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 18 మంది యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి గంజాయి, ఈ-సిగరెట్లు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. | Read More
నిద్రలేచే సరికి నీళ్ల మధ్యలో ఆవాసాలు- కాకినాడలో ఏలేరు ఉగ్రరూపం - Yeleru Floods in Kakinada
Yeleru Floods in Kakinada District : కాకినాడ జిల్లాలో 7 మండలాల్లో ఏలేరు విలయం సృష్టించింది. కాల్వలకు గండ్లుపడి ఊళ్లన్నీ జలమయమయ్యాయి. బయటకు అడుగుపెట్టేందుకూ వీలులేక గత రెండురోజులుగా ప్రజలంతా జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. | Read More
అక్కడేముంటది ? ఎలా వెళ్లాలి? - Kailasagiri to Attract Tourists
గమ్య నగరి విశాఖకు వచ్చే పర్యాటకులు కైలాసగిరికి వెళ్లకుండా ఉండరు. పర్యాటకుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. కొండపై అన్ని వైపులా నూతన వసతులు, ప్రాజెక్టుల నిర్మాణానికి అడుగులు పడ్డాయి. | Read More
గోదావరి వరద ఉద్ధృతి - పోలవరం స్పిల్వే నుంచి 13.37లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల - Godavari Flood Water Flows
Godavari Flood Water Outflows: గోదావరి వరద ప్రవాహం ఉధృతమవుతోంది. ఇవాళ సాయంత్రం వరకూ గోదావరిలో ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులకు చేరతాయని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ఏలూరు పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీరు స్పీల్ వే ఎగువన 32.710 మీటర్లుగా ఉండగా, స్పిల్ వే దిగువన 25.270 మీటర్లు నీటిమట్టం నమోదయింది. | Read More
ఆ రైతులకు చిరుత కష్టం - Leopard Wandering in Rajahmundry
Leopard Wandering in Rajahmundry People Fear : తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులో చిరుతపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడు ఆపద ఎలా ముంచుకొస్తుందోనని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం శ్రీరాంపురంలో చిరుత పాదముద్రలు కనిపించాయనే వందతులతో స్థానికులు హడలిపోయారు. చివరకు అవి పులివి కాదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. | Read More
తెలంగాణ సీఎంను కలిసిన డిప్యూటీ సీఎం పవన్ - రూ.కోటి చెక్ అందజేత - ap deputy cm donates 1 crore to Tg
AP Deputy CM Pawan Kalyan meet CM Revanth Reddy : సీఎం రేవంత్రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అందించారు. | Read More
ఉత్తరాంధ్రలో వరద బీభత్సం - ప్రజాప్రతినిధులు పర్యటించి చక్కదిద్దే ప్రయత్నం - FLOOD EFFECT IN UTTARANDRA
Heavy Rains in Uttarandra District : ఉత్తరాంధ్రలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రవాణా అస్తవ్యస్థమైంది. జలాశయాలు, వాగులు, గెడ్డలకు వరద ఉద్ధృతిగా ఎక్కువగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించి సమీక్షిస్తున్నారు. | Read More
రహదారులకు వరద కష్టం - రాష్ట్రవ్యాప్తంగా 5,921 కి.మీ. ధ్వంసం - Roads Destroyed in ap
Roads destroyed by rains and floods in AP : రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలు, వరదలకు రహదారులైతే రూపురేఖలు కోల్పోయాయి. రహదారులపై వరద ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు చోట్ల కోతకు గురయ్యాయి. మరి కొన్ని చోట్ల ముక్కలు ముక్కలుగా కొట్టుకుపోయాయి. దారులు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. | Read More
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు కేంద్ర బృందం పర్యటన - ఏర్పాట్లు సిద్ధం - Central Team in Flood Areas
Central Team Visit to Flood Affected Areas: కృష్ణా జిల్లాలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం ఇవాళ పర్యటించనుంది. ఈ నేపథ్యంలో రామవరప్పాడు, కేసరపల్లి ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ బాలాజీ పర్యటించారు. కేసరపల్లి వద్ద బుడమేరు కాలువను పరిశీలించారు. జిల్లాలో 64 గ్రామాలపై బుడమేరు వరదల ప్రభావం పడిందని, 50 వేల హెక్టారుల్లో పంటలు ముంపులో ఉన్నాయన్నారు. పంట నష్టం వివరాలు, ప్రజల ఇబ్బందులను కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్ బాలాజీ అన్నారు. | Read More
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఏడుగురు కార్మికులు మృతి - Road Accidents at east godavari
Several People Dead in Road Accident at East Godavari District : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు | Read More
చిరు వ్యాపారులపై బుడమేరు ఎఫెక్ట్ - పరిహారంతో పాటు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని వేడుకోలు - Flood Damage to Businessmen in AP
Flood Damage to Businessmen in AP: బుడమేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని చిరు వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అకస్మాత్తుగా వచ్చిన వరదలతో అటు కుటుంబాన్ని ఇటు వ్యాపార సమాగ్రిని కాపాడుకోలేక నిస్సహాయస్థితిలోకి వెళ్లిపోయారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో తమ దుకాణాల పరిస్థితిని చూసి చిన్న చిన్న వ్యాపారులు కన్నీరు పెట్టుకుంటున్నారు. | Read More
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం - 50.5 అడుగులకు చేరిన నీటిమట్టం - flood situation in godavari
Rising flood of Godavari at Bhadrachalam : తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 50.5 అడుగులకు చేరింది. ఈ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. క్రమంగా నీటిమట్టం పెరగడంతో ఏపీలోని విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. | Read More
ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలను వెలికి తీసేందుకు ప్లాన్-బి - నేడు అమలు - REMOVAL OF BOATS AT PRAKASAM
Heavy Boats Removing at Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న భారీ పడవలను వెలికి తీసేందుకు ఇంజినీర్లు , అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. బాహుబలి క్రేన్లు 5 గంటల పాటు శాయశక్తులా ప్రయత్నించినా నదిలో చిక్కుకున్న పడవలు ఒక్క అంగుళం కూడా కదల్లేదు . తొలి ప్రణాళిక విఫలం కావడంతో నేడు మరో ప్లాన్ ను అమలు చేయాలని ఇంజినీర్లు నిర్ణయించారు. | Read More