హంగూఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకోవాలనుకోవటమే కాకుండా... దానికయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించి ఆదర్శ నిర్ణయం తీసుకున్నాడు ఓ పెళ్లికొడుకు. సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన వ్యవసాయ విస్తీర్ణ అధికారి సంతోశ్ కుమార్ వివాహం ఈ నెల 26న జరగనుంది.
పెళ్లికయ్యే ఖర్చును సీఎంఆర్ఎఫ్కు ఇచ్చేశాడు
లాక్డౌన్ కారణంగా పెళ్లిళ్లను కొందరు వాయిదా వేసుకుంటే... ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేసుకుంటున్నారు మరికొందరు. అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు ఓ పెళ్లికొడుకు. ఇంకొంచెం ముందుకెళ్లి తన పెళ్లికయ్యే ఖర్చు మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్కు విరాళంగా అందించాడు.
![పెళ్లికయ్యే ఖర్చును సీఎంఆర్ఎఫ్కు ఇచ్చేశాడు A BRIDEGROOM DONATED MARRIAGE EXPENSES TO CMRF](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6897718-649-6897718-1587561511731.jpg?imwidth=3840)
కరోనా కారణంగా ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా పెళ్లి జరిపించాలని సంతోశ్ కుటుంబ పెద్దలు నిర్ణయించారు. అయితే తొలుత అనుకున్నట్లుగా పెళ్లికి దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు చేయాలనుకోగా... ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ఆ డబ్బును సీఎంఆర్ఎఫ్కు అందించ తలిచారు. అనుకున్నదే తడవుగా... మంత్రి హరీశ్ రావు సమక్షంలో కలెక్టరేట్ హనుమంతరావుకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:- లాక్డౌన్ నుంచి వీటికి మినహాయింపు
హంగూఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకోవాలనుకోవటమే కాకుండా... దానికయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించి ఆదర్శ నిర్ణయం తీసుకున్నాడు ఓ పెళ్లికొడుకు. సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన వ్యవసాయ విస్తీర్ణ అధికారి సంతోశ్ కుమార్ వివాహం ఈ నెల 26న జరగనుంది.
కరోనా కారణంగా ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా పెళ్లి జరిపించాలని సంతోశ్ కుటుంబ పెద్దలు నిర్ణయించారు. అయితే తొలుత అనుకున్నట్లుగా పెళ్లికి దాదాపు రూ. 2 లక్షలు ఖర్చు చేయాలనుకోగా... ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో ఆ డబ్బును సీఎంఆర్ఎఫ్కు అందించ తలిచారు. అనుకున్నదే తడవుగా... మంత్రి హరీశ్ రావు సమక్షంలో కలెక్టరేట్ హనుమంతరావుకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.