నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురంలో కంపసాగర్ వెళ్లే దారిలో సాగర్ ఎడమ కాల్వ సమీపంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. డ్రైవర్ ఆటోను కాల్వ పక్కన నిలిపి దిగుతుండగా ఒక్కసారిగా ఆటో కాల్వలోకి దూసుకెళ్లింది.
ఆ సమయంలో ప్రయాణికులు లేరు..
ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు క్రెన్ సహాయంతో ఆటోను బయటకు తీశారు. ఈ ఆటో త్రిపురారం మండలం కామారెడ్డి గూడేనికి చెందిన శ్రీనుగా గుర్తించారు.
ఇవీ చూడండి : గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ వ్యూహరచన