కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొవిడ్-19 వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కాగజ్నగర్ పట్టణంలో వారంరోజుల పాటు స్వచ్చందంగా బంద్ పాటించాలని వస్త్ర వ్యాపారులు నిర్ణయించారు.
కాగజ్నగర్ పట్టణంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలు, వ్యాపారులు వ్యాధి బారిన పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారం రోజులపాటు పూర్తిగా స్వచ్చందంగా బంద్ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు వస్త్ర వ్యాపార సంఘం సభ్యులు తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,817 కరోనా కేసులు, 10 మరణాలు