ETV Bharat / state

బీభత్సం సృష్టించిన అకాల వర్షం... రైతులకు తీవ్ర నష్టం

author img

By

Published : Apr 23, 2021, 8:58 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా మామిడి రైతులకు సుమారు రూ.2 కోట్లకు పైగానే నష్టం వాటిల్లింది. పొగాకు రైతులూ తీవ్రంగా నష్టపోయారు.

Rain news, badradri kothagudem news, aswarao peta
Rain news, badradri kothagudem news, aswarao peta

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా అశ్వారావుపేట, దమ్మపేట, చంద్రుగొండ మండలాల్లోని వందలాది ఎకరాల్లో మామిడితోటలో కాయలు నేలరాలాయి. నియోజకవర్గ వ్యాప్తంగా మామిడి రైతులకు సుమారు రూ.రెండు కోట్లకు పైగానే నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.

గాలివానకు నాటు పొగాకు రైతులు కూడా నష్టాన్ని చవిచూశారు. నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేయగా.. ఇప్పటికే 1,200 ఎకరాలకు పైగా పొగాకును కోశారు. అది తడిసి ముద్దయిపోయింది.

చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల్లో ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచగా.. అవీ తడిసిపోయాయి. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో చేతికి వచ్చిన పంట ఈదురు గాలులకు నేలవారింది. అకాల వర్షం అన్నదాతలను భారీగా నష్టాల పాలు చేసింది. దమ్మపేట మండలంలో ఒకటీ రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఇదీ చూడండి: రాత్రి కర్ఫ్యూ విధిస్తే సరిపోతుందా?: హైకోర్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా అశ్వారావుపేట, దమ్మపేట, చంద్రుగొండ మండలాల్లోని వందలాది ఎకరాల్లో మామిడితోటలో కాయలు నేలరాలాయి. నియోజకవర్గ వ్యాప్తంగా మామిడి రైతులకు సుమారు రూ.రెండు కోట్లకు పైగానే నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.

గాలివానకు నాటు పొగాకు రైతులు కూడా నష్టాన్ని చవిచూశారు. నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేయగా.. ఇప్పటికే 1,200 ఎకరాలకు పైగా పొగాకును కోశారు. అది తడిసి ముద్దయిపోయింది.

చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల్లో ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచగా.. అవీ తడిసిపోయాయి. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో చేతికి వచ్చిన పంట ఈదురు గాలులకు నేలవారింది. అకాల వర్షం అన్నదాతలను భారీగా నష్టాల పాలు చేసింది. దమ్మపేట మండలంలో ఒకటీ రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఇదీ చూడండి: రాత్రి కర్ఫ్యూ విధిస్తే సరిపోతుందా?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.