ETV Bharat / state

'కార్మికులకు రూ.7 వేల తక్షణ సాయం అందించాలి'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సీపీఐ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు. రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా ప్రతీ పేద కుటుంబానికి సాయం అందించాలని నేతలు డిమాండ్​ చేశారు.

author img

By

Published : May 4, 2020, 4:44 PM IST

CPI DOING HUNGER STRIKE IN ILLANDHU
'కార్మికులకు రూ.7 వేల తక్షణ సాయం అందించాలి'

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన అన్ని రంగాల కార్మికులకు తక్షణ సాయంగా రూ. 7వేలను చెల్లించాలని... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సీపీఐ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు. రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా ప్రతీ పేద కుటుంబాన్ని గుర్తించి సాయం అందించాలని నేతలు డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు పూర్తి వేతనం చెల్లించి... ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. వేసవి సమీపించినందున గ్రామాల్లో, పట్టణాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ నిబంధనలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన అన్ని రంగాల కార్మికులకు తక్షణ సాయంగా రూ. 7వేలను చెల్లించాలని... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సీపీఐ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు. రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా ప్రతీ పేద కుటుంబాన్ని గుర్తించి సాయం అందించాలని నేతలు డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు పూర్తి వేతనం చెల్లించి... ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. వేసవి సమీపించినందున గ్రామాల్లో, పట్టణాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ నిబంధనలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.