ETV Bharat / sitara

పవన్ కల్యాణ్​ నిర్మాతగా 15 సినిమాలు!

పవన్​ కల్యాణ్​ నిర్మించిన పవన్​కల్యాణ్​ క్రియేటివ్​ వర్క్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా కలిసి సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యాయి. ఇరు సంస్థలు కలిసి దాదాపు 15చిత్రాలు రూపొందించబోతున్నట్లు ప్రకటించాయి.

author img

By

Published : Apr 2, 2021, 9:27 PM IST

Updated : Apr 2, 2021, 9:53 PM IST

pawan
పవన్​

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్.. మూడేళ్ల విరామం తర్వాత 'వకీల్​సాబ్'​తో త్వరలో రీఎంట్రీ ఇవ్వనున్నారు​. దీంతో పాటే వరుసగా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు నిర్మాతగానూ మరింత దూకుడు చూపించేందుకు సిద్ధమయ్యారు​.

కొంతకాలం క్రితం 'పవన్​కల్యాణ్​ క్రియేటివ్​ వర్క్స్' నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్​లో 'సర్దార్​ గబ్బర్​ సింగ్'​, 'ఛల్​ మోహనరంగ' చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమాలేమి చేయలేదు. ఇప్పుడు మళ్లీ చిత్రాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు పవన్​. దీని కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పనిచేయనున్నారు.

pawan
పవన్​

ఈ రెండు సంస్థలు సంయుక్తంగా దాదాపు 15 సినిమాలను నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందులో ఆరు పరిమిత చిన్న తరహా, ఆరు మధ్య తరహా, మూడు భారీ చిత్రాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు. రచన, దర్శకత్వంపై ఆసక్తి ఉన్న యువతని వీటిలో భాగస్వామిని చేయబోతున్నట్టు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఆలోచల్ని, విభిన్న కథల్ని బహుభాషల్లో తెరకెక్కించగలిగే ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. దీనికి హరీశ్‌ పాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా కీలక బాధ్యత వహిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.

ప్రస్తుతం పవన్​ 'వకీల్​సాబ్'​తో పాటు 'అయ్యప్పన్​ కోషియమ్'​ తెలుగు రీమేక్​, క్రిష్​, హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్.. మూడేళ్ల విరామం తర్వాత 'వకీల్​సాబ్'​తో త్వరలో రీఎంట్రీ ఇవ్వనున్నారు​. దీంతో పాటే వరుసగా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు నిర్మాతగానూ మరింత దూకుడు చూపించేందుకు సిద్ధమయ్యారు​.

కొంతకాలం క్రితం 'పవన్​కల్యాణ్​ క్రియేటివ్​ వర్క్స్' నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్​లో 'సర్దార్​ గబ్బర్​ సింగ్'​, 'ఛల్​ మోహనరంగ' చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమాలేమి చేయలేదు. ఇప్పుడు మళ్లీ చిత్రాలు నిర్మించేందుకు సిద్ధమయ్యారు పవన్​. దీని కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పనిచేయనున్నారు.

pawan
పవన్​

ఈ రెండు సంస్థలు సంయుక్తంగా దాదాపు 15 సినిమాలను నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందులో ఆరు పరిమిత చిన్న తరహా, ఆరు మధ్య తరహా, మూడు భారీ చిత్రాలను రూపొందించనున్నట్లు వెల్లడించారు. రచన, దర్శకత్వంపై ఆసక్తి ఉన్న యువతని వీటిలో భాగస్వామిని చేయబోతున్నట్టు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఆలోచల్ని, విభిన్న కథల్ని బహుభాషల్లో తెరకెక్కించగలిగే ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. దీనికి హరీశ్‌ పాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా కీలక బాధ్యత వహిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.

ప్రస్తుతం పవన్​ 'వకీల్​సాబ్'​తో పాటు 'అయ్యప్పన్​ కోషియమ్'​ తెలుగు రీమేక్​, క్రిష్​, హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Apr 2, 2021, 9:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.