ETV Bharat / jagte-raho

పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన మహిళ అనుమానాస్పద మృతి

author img

By

Published : Aug 12, 2020, 7:01 PM IST

పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచాపూర్​​లో జరిగింది. గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వపై... మతిస్థిమితం లేని ఆమె భర్త దాడి చేసి ఉండొచ్చని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Breaking News

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మాచాపూర్​లో దారుణం జరిగింది. పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ... పొలంలో నీరుపెట్టడానికి వెళ్లింది. కొంతసేపటికి అటుగా వెళ్లిన స్థానికులు తలకు తీవ్ర గాయాలతో పడి ఉన్న దుర్గవ్వను గుర్తించారు. వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా... మార్గమధ్యలో తుదిశ్వాస విడిచింది.

మానసిక స్థితి సరిగా లేని ఆమె భర్త దుర్గవ్వపై పారతో దాడి చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : కేంద్ర హోంమంత్రి పతకానికి సీబీఐ హైదరాబాద్​ ఎస్పీ ఎంపిక

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మాచాపూర్​లో దారుణం జరిగింది. పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ... పొలంలో నీరుపెట్టడానికి వెళ్లింది. కొంతసేపటికి అటుగా వెళ్లిన స్థానికులు తలకు తీవ్ర గాయాలతో పడి ఉన్న దుర్గవ్వను గుర్తించారు. వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా... మార్గమధ్యలో తుదిశ్వాస విడిచింది.

మానసిక స్థితి సరిగా లేని ఆమె భర్త దుర్గవ్వపై పారతో దాడి చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : కేంద్ర హోంమంత్రి పతకానికి సీబీఐ హైదరాబాద్​ ఎస్పీ ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.