మేడ్చల్లో ఏటీఎంలోకి వెళ్లి వచ్చే సరికి ద్విచక్ర వాహనంలో డబ్బులు మాయమైన ఘటన చోటుచేసుకుంది. నగదు డ్రా చేసుకుని ఐడీబీఐ బ్యాంకు ముందు నిలిపి ఉంచిన సమయంలో ఇలా జరిగింది.
మేడ్చల్ మండలం సైదొని గడ్డ తండాకు చెందిన బిక్షపతి ఇటుక బట్టీలు నిర్వహిస్తాడు. కూలీలకు డబ్బులు చెల్లించాలని ఎస్బీఐ బ్యాంకు నుంచి ఆరు లక్షలు తీసుకురమ్మని అల్లుడు రాజేంద్ర, లక్ష్మణ్ను ద్విచక్ర వాహనంపై మేడ్చల్ పంపాడు.
వెళ్లి వచ్చే సరికి..
ఎస్బీఐలో నగదు డ్రా చేసుకుని ఐడీబీఐ బ్యాంకు ముందు ద్విచక్ర వాహనం నిలిపి ఏటీఎంలోకెళ్లి వచ్చే సరికి అందులోని డబ్బులు మాయమయ్యాయి. బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదుచేసుకుని చోరీ ఘటనపై విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: లోన్యాప్ల జోలికి పోవద్దు: ఏసీపీ హరినాథ్