ETV Bharat / city

రాజధాని రైతులు అరెస్ట్​.. గ్రామాల్లో ఉద్రిక్తత

author img

By

Published : Mar 9, 2021, 3:41 PM IST

మహిళా దినోత్సవం రోజు జరిగిన ఆందోళనలకు సంబంధించి ఏపీ రాజధాని రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా రైతులను సైతం ఎఫ్​ఐఆర్​లో చేర్చారు. అరెస్టులను నిరసిస్తూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేపట్టారు.

case-registration-under-ipc-sections-against-amaravati-farmers
రాజధాని రైతులు అరెస్ట్​.. గ్రామాల్లో ఉద్రిక్తత

మహిళా దినోత్సవం రోజు ఏపీ రాజధాని ప్రాంత మహిళలు, రైతులు ప్రకాశం బ్యారేజీపై నిరసనకు బయలుదేరారు. అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేపట్టారు. ముఖ్యంగా మందడం, మల్కాపురం ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి.

రైతులు వెలగపూడిలోని సచివాలయం వైపు వెళ్లేందుకు యత్నించారు. అక్కడ జరిగిన ఆందోళనలకు సంబంధించి ఐపీసీ 143, 188, 332 353, 506, 509, R/W 149 సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఆందోళనకు సంబంధించి పదిహేడు మంది పేర్లను ఎఫ్.ఐ.ఆర్​లో చేర్చారు.

ఇదీ చదవండి: త్వరలోనే 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: కేటీఆర్​

మహిళా దినోత్సవం రోజు ఏపీ రాజధాని ప్రాంత మహిళలు, రైతులు ప్రకాశం బ్యారేజీపై నిరసనకు బయలుదేరారు. అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేపట్టారు. ముఖ్యంగా మందడం, మల్కాపురం ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి.

రైతులు వెలగపూడిలోని సచివాలయం వైపు వెళ్లేందుకు యత్నించారు. అక్కడ జరిగిన ఆందోళనలకు సంబంధించి ఐపీసీ 143, 188, 332 353, 506, 509, R/W 149 సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఆందోళనకు సంబంధించి పదిహేడు మంది పేర్లను ఎఫ్.ఐ.ఆర్​లో చేర్చారు.

ఇదీ చదవండి: త్వరలోనే 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.