ETV Bharat / bharat

ఎంపీ ఇంట తీవ్ర విషాదం- రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి

author img

By

Published : Mar 10, 2022, 11:38 AM IST

DMK MP son died: డీఎంకే ఎంపీ ఎన్​ఆర్​ ఇళాంగో కుమారుడు రాజేశ్​ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చెన్నై నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా.. కొట్టకుప్పం సమీపంలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడికక్కడే రాజేశ్​ మరణించాడు.

DMK MP son died
DMK MP son died

DMK MP son died: తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ ఎన్​ఆర్​ ఇళాంగో తనయుడు రాజేశ్​(22) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రాజేశ్​, అతని స్నేహితుడితో చెన్నై నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు.. కొట్టకుప్పం సమీపంలో అదుపు తప్పి రోడ్డు డివైడర్​ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. వాహనం బోల్తాపడి రాజేశ్​ అక్కడికక్కడే మృతి చెందగా.. అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రాజేశ్​ మృతదేహాన్ని బయటకు తీశారు. రాజేశ్​​ స్నేహితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసుల నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: నీళ్ల బకెట్​లో ముంచి చిన్నారి హత్య- అమ్మమ్మ ప్రియుడే నిందితుడు!

DMK MP son died: తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ ఎన్​ఆర్​ ఇళాంగో తనయుడు రాజేశ్​(22) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రాజేశ్​, అతని స్నేహితుడితో చెన్నై నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు.. కొట్టకుప్పం సమీపంలో అదుపు తప్పి రోడ్డు డివైడర్​ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. వాహనం బోల్తాపడి రాజేశ్​ అక్కడికక్కడే మృతి చెందగా.. అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రాజేశ్​ మృతదేహాన్ని బయటకు తీశారు. రాజేశ్​​ స్నేహితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసుల నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: నీళ్ల బకెట్​లో ముంచి చిన్నారి హత్య- అమ్మమ్మ ప్రియుడే నిందితుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.