మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ప్రభుత్వం కూలిపోతే అందుకు జ్యోతిరాదిత్యే ప్రధాన కారణమవుతారు. గతంలో కూడా ఇదేరీతిలో మధ్యప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడంలో.. సింధియా నాయనమ్మ విజయరాజె కీలకపాత్ర పోషించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సింధియా కుటుంబీకులు రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు. వారందరికీ ఏదో ఒకవిధంగా భాజపా లేదా దీని మాతృసంస్థ జన్సంఘ్తో సంబంధం ఉంది.
![Jyotiraditya Scindia follows his grand mother's footsteps, quits Congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6364678_ns.jpg)
ఓటమెరుగని 'రాజె'మాత
భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన ‘రాజమాత’ విజయరాజె సింధియాది ఏ ఎన్నికల్లోనూ ఓడిపోని ఘనత. గ్వాలియర్ను ఏలిన చివరి రాజు జీవాజీరావు సింధియా సతీమణి ఆమె. పెళ్లికి ముందు ఆమె పేరు లేఖాదేవి. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో ముగ్గురు రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు.
1957లో రాజకీయాల్లోకి వచ్చిన విజయరాజె తొలుత కాంగ్రెస్లో చేరి గుణ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. 1967లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డీపీ మిశ్రాతో విభేదాలతో ఆమె జన్సంఘ్లో చేరారు. అనంతరం జన్సంఘ్ సభ్యులు, మరికొందరితో కలిసి సంయుక్త విధాయక్ దళ్ పేరిట ఓ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. దీంతో నాటి ప్రభుత్వం పడిపోయి, కూటమికి చెందిన గోవింద్ నారాయణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం గ్వాలియర్ ప్రాంతంలో జన్సంఘ్ అభివృద్ధిలో విజయరాజె కీలకపాత్ర పోషించారు. ఫలితంగా 1971లో ఇందిరాగాంధీ ప్రభంజనంలోనూ 3చోట్ల జన్సంఘ్ అభ్యర్థులు గెలుపొందారు. వారిలో విజయరాజెతో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ, ఆమె కుమారుడు మాధవరావు సింధియాలున్నారు. ఆమె 6 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 1967 నుంచి 1971 వరకు రాష్ట్ర అసెంబ్లీలో కూడా సభ్యురాలు. రాజ్యసభ సభ్యురాలిగా (1978-1989) కూడా పనిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిరను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె జైలుకు కూడా వెళ్లారు.
రాజకీయ వారసుడు జ్యోతిరాదిత్య
మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య తండ్రి బాటలో కాంగ్రెస్లోనే ఇంతవరకు కొనసాగారు. 2001లో మాధవరావు సింధియా ఓ విమాన ప్రమాదంలో కన్నుమూయగా అప్పటికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపాందారు. అనంతరం మూడు సార్లు గుణ నుంచి విజయం సాధించారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం తన చిరకాల ప్రత్యర్థి కృష్ణపాల్ సింగ్ యాదవ్ చేతిలో పరాజయం పాలయ్యారు.
తల్లికి తగ్గ తనయుడు మాధవరావు