By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2023, 1:57 PM IST
|Updated : Sep 2, 2023, 2:08 PM IST
Sharmila paid Tributes to YSR: వైఎస్సార్ ఘాట్ వద్ద విజయమ్మ, షర్మిల నివాళులు
Sharmila paid Tributes to YSR: కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనంపై వైఎస్ షర్మిల ఆచితూచి స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద తల్లి విజయమ్మతో కలిసి షర్మిల నివాళులర్పించారు. ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం సమాధి పైన పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్తో ఉన్న జ్ఞాపకాలను షర్మిల గుర్తు చేసుకున్నారు. పార్టీ విలీనంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఇది సరైన వేదిక కాదని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డిదని పేర్కొన్నారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేసిన మహానేత వైఎస్ అని తెలిపారు. మహానేత వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్రంలో 700 మంది పేదల గుండెలు ఆగిపోయాయని గుర్తు చేశారు. లక్షల మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలను ఆయన వర్ధంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం సంతోషంగా ఉందని షర్మిల వ్యాఖ్యానించారు.