ETV Bharat / state

మట్టి గుట్టలో యువకుడి మృతి.. - కడప జిల్లా వార్తలు

కడప జిల్లా పులివెందుల మండలం ఉల్లిమెల్ల గ్రామ మట్టి గుట్టల్లో ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ట్రాక్టర్​తో మట్టి తీసుకురావడానికి వెళ్లిన యువకుడు.. మృతి చెందడంపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

మట్టి గుట్టలో యువకుడు మృతి...కారణమేంటి?
మట్టి గుట్టలో యువకుడు మృతి...కారణమేంటి?
author img

By

Published : Jun 7, 2020, 7:42 PM IST

కడప జిల్లా పులివెందుల మండలం ఉలిమెల్ల గ్రామం సమీపంలోని గుట్టలో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆర్​. తుమ్మల పల్లె గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి ట్రాక్టర్​తో మట్టి తెచ్చేందుకు ఉలిమెల్ల గ్రామంలోని గుట్టకు వచ్చాడు. కానీ అనుమానాస్పద స్థితిలో ఆ మట్టి గుట్టల్లోనే యువకుడు శవమై కనిపించాడు. ఘటనాస్థలిలో ఏం జరిగిందో ఎవరూ చెప్పడంలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు ప్రొక్లైన్ తగిలి చనిపోయాడా...? ఎవరైనా దాడి చేసి చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కడప జిల్లా పులివెందుల మండలం ఉలిమెల్ల గ్రామం సమీపంలోని గుట్టలో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆర్​. తుమ్మల పల్లె గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి ట్రాక్టర్​తో మట్టి తెచ్చేందుకు ఉలిమెల్ల గ్రామంలోని గుట్టకు వచ్చాడు. కానీ అనుమానాస్పద స్థితిలో ఆ మట్టి గుట్టల్లోనే యువకుడు శవమై కనిపించాడు. ఘటనాస్థలిలో ఏం జరిగిందో ఎవరూ చెప్పడంలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు ప్రొక్లైన్ తగిలి చనిపోయాడా...? ఎవరైనా దాడి చేసి చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : రూ.27 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.