ETV Bharat / state

వాడక ముందే తుప్పు.. ఎవరిదీ తప్పు? - కడప కార్యాలయంలో ట్రాక్టర్లు వార్తలు

మేజర్‌ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం లక్షల రూపాయలు వెచ్చించి ట్రాక్టర్లు కొనుగోలు చేసింది కడప జిల్లా యంత్రాంగం. 40 శాతం రాయితీతో వీటిని ఎస్సీ వర్గాలకు అందజేయాల్సిన ఉన్నా... ఆ పని చేయలేదు. దీనివల్ల ఈ వాహనాలు ఏడాదిగా కడపలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మూలనపడి ఉన్నాయి.

tractors
tractors
author img

By

Published : Oct 31, 2020, 7:31 PM IST

కడప జిల్లాలోని మేజర్‌ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పంపిణి చేయాల్సిన ట్రాక్టర్లు దాదాపు ఏడాదిగా కడప కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఎండకు ఎండుతూ వానకు నానుతున్నాయి. 40 శాతం రాయితీతో ఈ వాహనాలను ఎస్సీ వర్గాలకు అందజేయాల్సి ఉంది. లబ్ధిదారుల జాబితా సిద్ధంగా ఉన్నా పంపిణీ మాత్రం జరగలేదు. దీనితో రోడ్డెక్కక ముందే ఈ వాహనాలు తుప్పుపడుతున్నాయి.

ఈ విషయాన్ని 'ఈనాడు' ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా కార్యనిర్వహణాధికారి వెంకట సుబ్బయ్య దృష్టికి తీసుకెళ్లగా.. ట్రాక్టర్లను సరఫరా చేసిన కంపెనీ తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేయించకపోవటంతో లబ్ధిదారులకు అందజేయలేకపోతున్నామని.. 20 రోజుల్లో పంపిణీ చేస్తామని తెలిపారు.

కడప జిల్లాలోని మేజర్‌ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పంపిణి చేయాల్సిన ట్రాక్టర్లు దాదాపు ఏడాదిగా కడప కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఎండకు ఎండుతూ వానకు నానుతున్నాయి. 40 శాతం రాయితీతో ఈ వాహనాలను ఎస్సీ వర్గాలకు అందజేయాల్సి ఉంది. లబ్ధిదారుల జాబితా సిద్ధంగా ఉన్నా పంపిణీ మాత్రం జరగలేదు. దీనితో రోడ్డెక్కక ముందే ఈ వాహనాలు తుప్పుపడుతున్నాయి.

ఈ విషయాన్ని 'ఈనాడు' ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా కార్యనిర్వహణాధికారి వెంకట సుబ్బయ్య దృష్టికి తీసుకెళ్లగా.. ట్రాక్టర్లను సరఫరా చేసిన కంపెనీ తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేయించకపోవటంతో లబ్ధిదారులకు అందజేయలేకపోతున్నామని.. 20 రోజుల్లో పంపిణీ చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి

ఇల్లెక్కిన స్కార్పియో.. మహీంద్రా ఫిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.